Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:35 AM

పేదవాడి సొంతింటి కల కాంగ్రెస్‌తోనే సాధ్యం: మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

పేదవాడి సొంతింటి కల కాంగ్రెస్‌తోనే సాధ్యం: మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

పేదవాడి సొంతింటి కల కాంగ్రెస్‌తోనే సాధ్యం: మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్
13-07-2026 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నిజం కావాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, అది కేవలం కాంగ్రెస్‌ హయాంలోనే సాధ్యమవుతుందని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ స్పష్టం చేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో మహమ్మద్ రహమత్ నూతనంగా నిర్మించుకున్న 'ఇందిరమ్మ ఇల్లు'ను ఆదివారం ఆమె రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ పావని రమేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలనే ఒక గొప్ప సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి ఆశీస్సులు, సహకారం నియోజకవర్గ పేద ప్రజలకు ఎల్లప్పుడూ ఉంటాయని ఆమె భరోసా ఇచ్చారు.ఈ గృహప్రవేశ మహోత్సవ కార్యక్రమంలో 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసర్ల శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు ఎండీ హన్నుబాయి, పాక చిరంజీవి, కో-ఆప్షన్ మెంబర్స్ పస్తం గంగ రాములు, ఎండీ బాబా షరీఫ్, షాదీఖానా చైర్మన్ ఎండీ కరీం, స్థానిక నాయకులు ఎండీ ఎజాస్ పాషా, ఎండీ గౌష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పేదవాడి సొంతింటి కల కాంగ్రెస్‌తోనే సాధ్యం: మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

Article Image

రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నిజం కావాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, అది కేవలం కాంగ్రెస్‌ హయాంలోనే సాధ్యమవుతుందని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ స్పష్టం చేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో మహమ్మద్ రహమత్ నూతనంగా నిర్మించుకున్న 'ఇందిరమ్మ ఇల్లు'ను ఆదివారం ఆమె రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ పావని రమేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలనే ఒక గొప్ప సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి ఆశీస్సులు, సహకారం నియోజకవర్గ పేద ప్రజలకు ఎల్లప్పుడూ ఉంటాయని ఆమె భరోసా ఇచ్చారు.ఈ గృహప్రవేశ మహోత్సవ కార్యక్రమంలో 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసర్ల శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు ఎండీ హన్నుబాయి, పాక చిరంజీవి, కో-ఆప్షన్ మెంబర్స్ పస్తం గంగ రాములు, ఎండీ బాబా షరీఫ్, షాదీఖానా చైర్మన్ ఎండీ కరీం, స్థానిక నాయకులు ఎండీ ఎజాస్ పాషా, ఎండీ గౌష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News