Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెన్షన్ కోసం వెళ్లి ప్రాణాలతో పోరాటం..! నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 13, 2026 09:37 AM

పేదవాడి సొంతింటి కల కాంగ్రెస్‌తోనే సాధ్యం: మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

పేదవాడి సొంతింటి కల కాంగ్రెస్‌తోనే సాధ్యం: మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

పేదవాడి సొంతింటి కల కాంగ్రెస్‌తోనే సాధ్యం: మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్
July 13, 2026 08:18 AM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నిజం కావాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, అది కేవలం కాంగ్రెస్‌ హయాంలోనే సాధ్యమవుతుందని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ స్పష్టం చేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో మహమ్మద్ రహమత్ నూతనంగా నిర్మించుకున్న 'ఇందిరమ్మ ఇల్లు'ను ఆదివారం ఆమె రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ పావని రమేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలనే ఒక గొప్ప సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి ఆశీస్సులు, సహకారం నియోజకవర్గ పేద ప్రజలకు ఎల్లప్పుడూ ఉంటాయని ఆమె భరోసా ఇచ్చారు.ఈ గృహప్రవేశ మహోత్సవ కార్యక్రమంలో 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసర్ల శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు ఎండీ హన్నుబాయి, పాక చిరంజీవి, కో-ఆప్షన్ మెంబర్స్ పస్తం గంగ రాములు, ఎండీ బాబా షరీఫ్, షాదీఖానా చైర్మన్ ఎండీ కరీం, స్థానిక నాయకులు ఎండీ ఎజాస్ పాషా, ఎండీ గౌష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News