పేదవాడి సొంతింటి కల కాంగ్రెస్తోనే సాధ్యం: మున్సిపల్ చైర్పర్సన్ పావని రమేష్ గౌడ్
పేదవాడి సొంతింటి కల కాంగ్రెస్తోనే సాధ్యం: మున్సిపల్ చైర్పర్సన్ పావని రమేష్ గౌడ్
K.RAVI
రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నిజం కావాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, అది కేవలం కాంగ్రెస్ హయాంలోనే సాధ్యమవుతుందని చౌటుప్పల్ మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ స్పష్టం చేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో మహమ్మద్ రహమత్ నూతనంగా నిర్మించుకున్న 'ఇందిరమ్మ ఇల్లు'ను ఆదివారం ఆమె రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ పావని రమేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలనే ఒక గొప్ప సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి ఆశీస్సులు, సహకారం నియోజకవర్గ పేద ప్రజలకు ఎల్లప్పుడూ ఉంటాయని ఆమె భరోసా ఇచ్చారు.ఈ గృహప్రవేశ మహోత్సవ కార్యక్రమంలో 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసర్ల శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు ఎండీ హన్నుబాయి, పాక చిరంజీవి, కో-ఆప్షన్ మెంబర్స్ పస్తం గంగ రాములు, ఎండీ బాబా షరీఫ్, షాదీఖానా చైర్మన్ ఎండీ కరీం, స్థానిక నాయకులు ఎండీ ఎజాస్ పాషా, ఎండీ గౌష్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి