నకిరేకల్లో పద్మశాలి భవన నిర్మాణానికి శంకుస్థాపన
నకిరేకల్లో పద్మశాలి భవన నిర్మాణానికి శంకుస్థాపన
Komidala Mahender reddy
నకిరేకల్ పట్టణంలో పద్మశాలి సంఘం కోసం రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన కమ్యూనిటీ భవనం, డైనింగ్ హాల్ నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పద్మశాలి సంఘ సభ్యుల సామాజిక, సాంస్కృతిక, సామూహిక కార్యక్రమాల నిర్వహణకు ఈ కమ్యూనిటీ భవనం ఉపయోగకరంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
నకిరేకల్ నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తి చేస్తూ, ప్రతి వర్గానికి మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పద్మశాలి సంఘ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కమ్యూనిటీ భవనం నిర్మాణంతో పద్మశాలి సంఘానికి శాశ్వత వేదిక అందుబాటులోకి రానుందని సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి