జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా పోకల దేవదాసు నియామకం
జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా పోకల దేవదాసు నియామకం
Komidala Mahender reddy
నల్గొండ జిల్లా చిట్యాల పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పోకల దేవదాసు జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆయనకు నియామక పత్రాన్ని జారీ చేశారు. ఈ సందర్భంగా పోకల దేవదాసు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి తాను అందిస్తున్న సేవలను గుర్తించి, ఈ బాధ్యతను అప్పగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, పార్టీ బలోపేతానికి మరియు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర రోడ్డు, భవనాల మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, నకిరేకల్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు, మరియు నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేతకు దేవదాసు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి