చేనేత ఎన్నికల రణరంగం: మార్కండేయ స్వామి ప్యానెల్ నామినేషన్ల జాతర!
చేనేత ఎన్నికల రణరంగం: మార్కండేయ స్వామి ప్యానెల్ నామినేషన్ల జాతర!
K.RAVI
* కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా బరిలోకి అభ్యర్థులు
* భారీగా తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, చేనేత నాయకులు
చేనేత సహకార సంఘం ఎన్నికల వేడి పీక్కు చేరింది. ఎన్నికల నేపథ్యంలో శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి ప్యానెల్ అభ్యర్థులు అత్యంత ఘనంగా, కోలాహలంగా తమ నామినేషన్లను దాఖలు చేశారు. ప్యానెల్ అభ్యర్థుల నామినేషన్ల పర్వానికి చేనేత కార్మికులు, ప్రముఖ నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చి మద్దతు ప్రకటించడంతో ఎన్నికల వాతావరణం సందడిగా మారింది.మార్కండేయ స్వామి ప్యానెల్ నామినేషన్ల కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ నాయకులు హాజరై అభ్యర్థులకు తమ పూర్తి మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా చేనేత సహకార సంఘం పర్సన్ ఇన్చార్జి కందగట్ల బిక్షపతి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బడుగుల లక్ష్మయ్య, పురపాలక వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, మాజీ అధ్యక్షులు గోశిక చక్రపాణి, మాజీ ఎంపీపీ చిక్క నరసింహ తమ సంఘీభావాన్ని తెలియజేశారు. సంఘం ఉపాధ్యక్షులు బడుగు అంజయ్య, శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవస్థానం అధ్యక్షులు బడుగు జయప్రకాష్, డైరెక్టర్ గోశిక చంద్రకళ తదితరులు పాల్గొని అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి ప్యానెల్ తరఫున ఎన్నికల బరిలో నిలిచిన ముఖ్య అభ్యర్థులు బడుగు మోహన్ బాబు, గోశిక శ్రీకాంత్, కాటబత్తిని భీమయ్య,గోశిక నరసింహ,దోర్నాల లక్ష్మీనారాయణ, పాపని రామకృష్ణ, గోశిక లక్ష్మీపతిబడుగు సావిత్రమ్మ,బత్తుల మానస లు పాల్గొన్నారు. నామినేషన్ల అనంతరం ప్యానెల్ ముఖ్య నాయకులు మాట్లాడుతూ.. చేనేత కార్మికుల సంక్షేమం, సహకార సంఘం సమగ్ర అభివృద్ధి, సభ్యుల హక్కుల పరిరక్షణే తమ ప్యానెల్ యొక్క ప్రధాన శ్వాస అని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో చేనేత కార్మికులందరూ ఏకతాటిపైకి వచ్చి, శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి ప్యానెల్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, చేనేత రంగాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి