రామన్నపేట: మండలంలోని ఉత్తటూరు గ్రామానికి చెందిన బందెల లింగస్వామి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గురువారం గ్రామానికి వెళ్లి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ధైర్యంగా ఉండాలని ఓదార్చారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, మాజీ సర్పంచ్ కోళ్ల స్వామి, నాయకులు కోళ్ల కిషన్, జెట్టి సైదులు, పోతుల స్వామి, మేడి రాజు, జంగిలి శ్రీను, బందెల నరసింహ, జంగిలి స్వామి, యాదయ్య, రాజు, వెంకన్న, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి