ప్రాణదాతలైన వైద్యుల సేవలు వెలకట్టలేనివి: మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్
ప్రాణదాతలైన వైద్యుల సేవలు వెలకట్టలేనివి: మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్
K.RAVI
చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు
సమాజంలో ప్రాణదాతలైన వైద్యుల సేవలు వెలకట్టలేనివని చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలోని వైద్యులను, సిబ్బందిని పూలబొకేలు, శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఆమె మాట్లాడుతూ.. సమాజంలో డాక్టర్లకు దేవునితో సమానమైన స్థానం ఉందన్నారు. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించడంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ, అత్యవసర సమయాల్లోనూ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వైద్యులు అందించిన సేవలు ఎప్పటికీ మరువలేనివని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఎండి హన్నుబాయ్, కో ఆప్షన్ సభ్యులు బాబా షరీఫ్, డిసిసి కార్యదర్శి చింతల సాయిలు, యువజన కాంగ్రెస్ నాయకులు సుర్కంటి బాలకృష్ణ రెడ్డి, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి