జి రాంజీ పథకాన్ని రద్దుచేసి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి; యాదగిరి
జి రాంజీ పథకాన్ని రద్దుచేసి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి; యాదగిరి
Bandi Kiran Kumar
ఉపాధి హామీ పథకం ద్వారా ఎంతోమంది పేద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడుతుందని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తున్న సందర్భంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం దాని పేరును తొలగించి జి రామ్ జి పథకం పేరుతో కూలీలను మోసం చేసే విధంగా ఉందని రైతు సంఘం రాష్ట్ర సభ్యుడు కొలిశెట్టి యాదగిరి రావు విమర్శించారు ఈరోజు అనగా బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీసు ముందు పథకాన్ని రద్దుచేసి పేదలకు న్యాయం చేయాలని తెలంగాణ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకు ఆయన హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తూ ఈ దేశంలో ఉన్న పేద మధ్యతరగత ప్రజలకు తీవ్రమైన మోసం చేస్తుందని విమర్శించారు జి.రాంజీ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 40% కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు ఇవ్వాలని నిర్ణయించినందున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డబ్బు లేక వివిధ పథకాలను రద్దు చేసుకుందని గతంలో ఉన్న మాదిరిగా కేంద్ర ప్రభుత్వం 90% రాష్ట్ర ప్రభుత్వం 10% ఉండాలని ఇప్పుడు వందరోజులకు బదులు 125 రోజులు తీసుకొచ్చినామని గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు కొనసాగిస్తుందని విచారణ వ్యక్తం చేశారు రైతులకు మోసం చేసే విధంగా చట్టాలను తీసుకొచ్చిన ఒక సంవత్సరం తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు చేపడితే ఆ చట్టాలను వెనుకకు తీసుకున్నదని కార్మికులకు ఎన్నో సంవత్సరాలు కొట్టాడు సాధించుకున్న కార్మిక చట్టాలను తొలగించి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోట్లను తీసుకొచ్చి కార్మికుల బ్రతుకులను బజారుకు ఈడ్చిందని అన్నారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ దేశంలో అత్యధిక శాతం ఉన్న పేద మధ్యతరగతి కార్మిక కర్షక వర్గానికి సంబంధించిన ప్రజలకు మేలు చేసే విధంగా చట్టాలను తయారు చేయాలని ఉపయోగపడే చట్టాలను తొలగించకూడదని ఆ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు తదనంతరం ఎంపీడీవోకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది
కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకుడు బుర్ర శ్రీనివాసు రై సంఘం జిల్లా నాయకుడు పళ్ళ సుదర్శన్ ప్రజా సంఘాల నాయకులు జాజుగాల్ల ముత్తయ్య మరిపెద్ది యాదగిరి బిల్లింగ్ వర్కర్స్ నాయకులు శేఖర్ నాగేష్ మల్సూరు నాయకులు గడ్డం ఎల్లయ్య ఉప్పుల సోమయ్య చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి