Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:02 AM

హైదరాబాద్ మార్గంలో ఎలక్ట్రిక్ బస్సుల దుస్థితి

హైదరాబాద్ మార్గంలో ఎలక్ట్రిక్ బస్సుల దుస్థితి

హైదరాబాద్ మార్గంలో ఎలక్ట్రిక్ బస్సుల దుస్థితి
01-07-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


లైట్లు లేక రాత్రి ప్రయాణం.. మెయింటెనెన్స్ లేక డ్రైవర్లు, ప్రయాణికుల అవస్థలు.

జీతాల చెల్లింపులోనూ జాప్యం.. యాజమాన్యంపై ఉద్యోగుల ఆవేదన


సూర్యాపేట–హైదరాబాద్ మార్గంలో నడిచే ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీస మెయింటెనెన్స్ లేకుండా బస్సులను రోడ్డుపైకి పంపుతున్నారని డ్రైవర్లు, ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో కొన్ని బస్సుల్లో లైట్లు సరిగా పనిచేయకపోవడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారుతోందని వారు చెబుతున్నారు.

బస్సుల్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను యాజమాన్యం పట్టించుకోవడం లేదని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. వాహనాల్లో ఎలాంటి టెక్నికల్ ఇష్యూలు ఉన్నా వాటిని పరిష్కరించకుండా అలాగే నడపాలని ఒత్తిడి తెస్తున్నారని వాపోతున్నారు. సమస్యలపై డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లగా, “నడపగలిగితే నడపండి.. లేకుంటే పక్కకు పెట్టి వెళ్లండి” అంటూ నిర్లక్ష్యంగా స్పందిస్తున్నారని కొందరు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో చెల్లించడం లేదని సమాచారం. దీంతో ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతోందని తెలుస్తోంది. బస్సుల నిర్వహణ లోపాల కారణంగా డ్రైవర్లతో పాటు ప్రయాణికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఎలక్ట్రిక్ బస్సులకు తగిన మరమ్మతులు చేపట్టి, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రయాణికులు, ఉద్యోగులు కోరుతున్నారు. ప్రయాణ భద్రత విషయంలో నిర్లక్ష్యం ప్రాణాంతక పరిణామాలకు దారితీయవచ్చని వారు హెచ్చరిస్తున్నారు.

Sthanikam

హైదరాబాద్ మార్గంలో ఎలక్ట్రిక్ బస్సుల దుస్థితి

Article Image


లైట్లు లేక రాత్రి ప్రయాణం.. మెయింటెనెన్స్ లేక డ్రైవర్లు, ప్రయాణికుల అవస్థలు.

జీతాల చెల్లింపులోనూ జాప్యం.. యాజమాన్యంపై ఉద్యోగుల ఆవేదన


సూర్యాపేట–హైదరాబాద్ మార్గంలో నడిచే ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీస మెయింటెనెన్స్ లేకుండా బస్సులను రోడ్డుపైకి పంపుతున్నారని డ్రైవర్లు, ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో కొన్ని బస్సుల్లో లైట్లు సరిగా పనిచేయకపోవడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారుతోందని వారు చెబుతున్నారు.

బస్సుల్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను యాజమాన్యం పట్టించుకోవడం లేదని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. వాహనాల్లో ఎలాంటి టెక్నికల్ ఇష్యూలు ఉన్నా వాటిని పరిష్కరించకుండా అలాగే నడపాలని ఒత్తిడి తెస్తున్నారని వాపోతున్నారు. సమస్యలపై డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లగా, “నడపగలిగితే నడపండి.. లేకుంటే పక్కకు పెట్టి వెళ్లండి” అంటూ నిర్లక్ష్యంగా స్పందిస్తున్నారని కొందరు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో చెల్లించడం లేదని సమాచారం. దీంతో ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతోందని తెలుస్తోంది. బస్సుల నిర్వహణ లోపాల కారణంగా డ్రైవర్లతో పాటు ప్రయాణికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఎలక్ట్రిక్ బస్సులకు తగిన మరమ్మతులు చేపట్టి, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రయాణికులు, ఉద్యోగులు కోరుతున్నారు. ప్రయాణ భద్రత విషయంలో నిర్లక్ష్యం ప్రాణాంతక పరిణామాలకు దారితీయవచ్చని వారు హెచ్చరిస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News