హైదరాబాద్ మార్గంలో ఎలక్ట్రిక్ బస్సుల దుస్థితి
హైదరాబాద్ మార్గంలో ఎలక్ట్రిక్ బస్సుల దుస్థితి
Komidala Mahender reddy
లైట్లు లేక రాత్రి ప్రయాణం.. మెయింటెనెన్స్ లేక డ్రైవర్లు, ప్రయాణికుల అవస్థలు.
జీతాల చెల్లింపులోనూ జాప్యం.. యాజమాన్యంపై ఉద్యోగుల ఆవేదన
సూర్యాపేట–హైదరాబాద్ మార్గంలో నడిచే ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీస మెయింటెనెన్స్ లేకుండా బస్సులను రోడ్డుపైకి పంపుతున్నారని డ్రైవర్లు, ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో కొన్ని బస్సుల్లో లైట్లు సరిగా పనిచేయకపోవడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారుతోందని వారు చెబుతున్నారు.
బస్సుల్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను యాజమాన్యం పట్టించుకోవడం లేదని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. వాహనాల్లో ఎలాంటి టెక్నికల్ ఇష్యూలు ఉన్నా వాటిని పరిష్కరించకుండా అలాగే నడపాలని ఒత్తిడి తెస్తున్నారని వాపోతున్నారు. సమస్యలపై డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లగా, “నడపగలిగితే నడపండి.. లేకుంటే పక్కకు పెట్టి వెళ్లండి” అంటూ నిర్లక్ష్యంగా స్పందిస్తున్నారని కొందరు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో చెల్లించడం లేదని సమాచారం. దీంతో ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతోందని తెలుస్తోంది. బస్సుల నిర్వహణ లోపాల కారణంగా డ్రైవర్లతో పాటు ప్రయాణికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఎలక్ట్రిక్ బస్సులకు తగిన మరమ్మతులు చేపట్టి, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రయాణికులు, ఉద్యోగులు కోరుతున్నారు. ప్రయాణ భద్రత విషయంలో నిర్లక్ష్యం ప్రాణాంతక పరిణామాలకు దారితీయవచ్చని వారు హెచ్చరిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి