Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:07 PM

విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత.. నీట్ పరీక్షలకు పోలీసుల ప్రత్యేక పర్యవేక్షణ

విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత.. నీట్ పరీక్షలకు పోలీసుల ప్రత్యేక పర్యవేక్షణ

విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత.. నీట్ పరీక్షలకు పోలీసుల ప్రత్యేక పర్యవేక్షణ
20-06-2026 244 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఆదివారం నిర్వహించనున్న నీట్-యూజీ 2026 పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 9 పరీక్షా కేంద్రాల్లో 2,924 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానుండగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాల నిఘా, జామర్ల ఏర్పాటు, ప్రత్యేక పోలీసు బందోబస్తుతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు జరగనుండగా, అభ్యర్థులను మధ్యాహ్నం 1:30 గంటల వరకు మాత్రమే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉండటంతో పాటు జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను తాత్కాలికంగా మూసివేయనున్నారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డు, గుర్తింపు కార్డుతో పాటు అవసరమైన పత్రాలు వెంట తీసుకురావాలని, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, నగలు తీసుకురావద్దని అధికారులు సూచించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా నిబంధనలు పాటిస్తూ సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకుని పరీక్షను విజయవంతంగా రాయాలని జిల్లా ఎస్పీ కోరారు.

Sthanikam

విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత.. నీట్ పరీక్షలకు పోలీసుల ప్రత్యేక పర్యవేక్షణ

Article Image

ఆదివారం నిర్వహించనున్న నీట్-యూజీ 2026 పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 9 పరీక్షా కేంద్రాల్లో 2,924 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానుండగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాల నిఘా, జామర్ల ఏర్పాటు, ప్రత్యేక పోలీసు బందోబస్తుతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు జరగనుండగా, అభ్యర్థులను మధ్యాహ్నం 1:30 గంటల వరకు మాత్రమే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉండటంతో పాటు జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను తాత్కాలికంగా మూసివేయనున్నారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డు, గుర్తింపు కార్డుతో పాటు అవసరమైన పత్రాలు వెంట తీసుకురావాలని, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, నగలు తీసుకురావద్దని అధికారులు సూచించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా నిబంధనలు పాటిస్తూ సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకుని పరీక్షను విజయవంతంగా రాయాలని జిల్లా ఎస్పీ కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News