తుంగతుర్తి!తెలంగాణ సిద్ధాంతకర్త, స్వరాష్ట్ర ఉద్యమానికి మార్గదర్శకుడైన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని తుంగతుర్తి మండల కేంద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో గురువారం ఘనంగా నివాళులర్పించారు.పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆచార్య జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న మాట్లాడుతూ....నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించి ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన మహనీయుడు ఆచార్య జయశంకర్ సార్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగాలు, సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను భావితరాలకు చేరవేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మార్కులు కమిటీ డైరెక్టర్లు బానోతు శ్రీను, స్వర్గం నరసయ్య, మార్కెట్ కమిటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలోజయశంకర్ సార్ కు నివాళులు
తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలోజయశంకర్ సార్ కు నివాళులు
Bandi Kiran Kumar
తుంగతుర్తి!తెలంగాణ సిద్ధాంతకర్త, స్వరాష్ట్ర ఉద్యమానికి మార్గదర్శకుడైన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని తుంగతుర్తి మండల కేంద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో గురువారం ఘనంగా నివాళులర్పించారు.పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆచార్య జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న మాట్లాడుతూ....నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించి ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన మహనీయుడు ఆచార్య జయశంకర్ సార్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగాలు, సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను భావితరాలకు చేరవేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మార్కులు కమిటీ డైరెక్టర్లు బానోతు శ్రీను, స్వర్గం నరసయ్య, మార్కెట్ కమిటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి