తిరుమలగిరి;తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ తాత్వికుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు గురువారం తిరుమలగిరి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషి, అందించిన సిద్ధాంతపరమైన మార్గదర్శనం ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి పునాది వేసిన మహనీయుడిగా ఆయన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.
ఈకార్యక్రమంలో వైస్ చైర్మన్ గోవిందమ్మ రవీందర్, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, వాడు కౌన్సిలర్లు జ్యోతి నరోత్తం రెడ్డి, p లక్ష్మి యాదగిరి, త్రిశూల్, యాకుబు నాయక్, యాదగిరి కో ఆప్షన్ సభ్యులు దేశీయ నాయక్, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి