నారాయణఖేడ్ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో గురువారం ప్రజాకవి గద్దర్ మూడో వర్థంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి, అంబేద్కర్ భవన్ ఇన్చార్జి భీమసేన, బీఎస్పీ నాయకులు అనుముల తుకారం, నారాయణరెడ్డి అధ్యక్షుడు, సిద్దు, సామిల్, యేసు తదితరులు గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గద్దర్ తన పాటలు, రచనలు, ఉద్యమాల ద్వారా అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన గొప్ప ప్రజాకవి, ప్రజాకళాకారుడని కొనియాడారు. సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. గద్దర్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని సమాజంలో సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక చైతన్యం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు గద్దర్ సేవలను స్మరించుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
ప్రజాకవి గద్దర్ సేవలు చిరస్మరణీయం.. నారాయణఖేడ్లో ఘనంగా వర్థంతి
ప్రజాకవి గద్దర్ సేవలు చిరస్మరణీయం.. నారాయణఖేడ్లో ఘనంగా వర్థంతి
Krishna
నారాయణఖేడ్ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో గురువారం ప్రజాకవి గద్దర్ మూడో వర్థంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి, అంబేద్కర్ భవన్ ఇన్చార్జి భీమసేన, బీఎస్పీ నాయకులు అనుముల తుకారం, నారాయణరెడ్డి అధ్యక్షుడు, సిద్దు, సామిల్, యేసు తదితరులు గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గద్దర్ తన పాటలు, రచనలు, ఉద్యమాల ద్వారా అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన గొప్ప ప్రజాకవి, ప్రజాకళాకారుడని కొనియాడారు. సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. గద్దర్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని సమాజంలో సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక చైతన్యం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు గద్దర్ సేవలను స్మరించుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి