Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 08:59 PM

ప్రజాకవి గద్దర్ సేవలు చిరస్మరణీయం.. నారాయణఖేడ్‌లో ఘనంగా వర్థంతి

ప్రజాకవి గద్దర్ సేవలు చిరస్మరణీయం.. నారాయణఖేడ్‌లో ఘనంగా వర్థంతి

ప్రజాకవి గద్దర్ సేవలు చిరస్మరణీయం.. నారాయణఖేడ్‌లో ఘనంగా వర్థంతి
06-08-2026 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణంలోని అంబేద్కర్ భవన్‌లో గురువారం ప్రజాకవి గద్దర్ మూడో వర్థంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి, అంబేద్కర్ భవన్ ఇన్‌చార్జి భీమసేన, బీఎస్పీ నాయకులు అనుముల తుకారం, నారాయణరెడ్డి అధ్యక్షుడు, సిద్దు, సామిల్, యేసు తదితరులు గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గద్దర్ తన పాటలు, రచనలు, ఉద్యమాల ద్వారా అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన గొప్ప ప్రజాకవి, ప్రజాకళాకారుడని కొనియాడారు. సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. గద్దర్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని సమాజంలో సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక చైతన్యం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు గద్దర్ సేవలను స్మరించుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

Sthanikam

ప్రజాకవి గద్దర్ సేవలు చిరస్మరణీయం.. నారాయణఖేడ్‌లో ఘనంగా వర్థంతి

Article Image

నారాయణఖేడ్ పట్టణంలోని అంబేద్కర్ భవన్‌లో గురువారం ప్రజాకవి గద్దర్ మూడో వర్థంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి, అంబేద్కర్ భవన్ ఇన్‌చార్జి భీమసేన, బీఎస్పీ నాయకులు అనుముల తుకారం, నారాయణరెడ్డి అధ్యక్షుడు, సిద్దు, సామిల్, యేసు తదితరులు గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గద్దర్ తన పాటలు, రచనలు, ఉద్యమాల ద్వారా అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన గొప్ప ప్రజాకవి, ప్రజాకళాకారుడని కొనియాడారు. సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. గద్దర్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని సమాజంలో సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక చైతన్యం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు గద్దర్ సేవలను స్మరించుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News