Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:05 AM

పెద్దకాపర్తిలో రైతులకు CRIDA శాస్త్రవేత్తల అవగాహన

పెద్దకాపర్తిలో రైతులకు CRIDA శాస్త్రవేత్తల అవగాహన

పెద్దకాపర్తిలో రైతులకు CRIDA శాస్త్రవేత్తల అవగాహన
01-07-2026 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


భూసార పరిరక్షణకు సమతుల్య ఎరువులు, పంట మార్పిడి అవసరం

రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ సాగుపై దృష్టి పెట్టాలని సూచన


చిట్యాల, జూలై 1:

హైదరాబాద్‌కు చెందిన మెట్ట పరిశోధన సంస్థ (CRIDA) శాస్త్రవేత్తలు బుధవారం చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో రైతులకు భూసార పరిరక్షణ, సుస్థిర వ్యవసాయ పద్ధతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. “కేత్ బచావో అభియాన్” మరియు “మేరా గావ్ మేరా గౌరవ్” కార్యక్రమాల కింద జరిగిన ఈ సమావేశంలో రైతులకు వ్యవసాయ భూముల సంరక్షణపై పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు డాక్టర్ గోష్, డాక్టర్ రవికాంత్, మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు మాట్లాడుతూ రైతులు అధికంగా రసాయన ఎరువులు వినియోగించడం వల్ల భూసారం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలకు సారవంతమైన నేలను అందించాలంటే సమతుల్య ఎరువుల వినియోగం, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని సూచించారు.

పెంట ఎరువు, పచ్చిరొట్టె ఎరువులు వంటి సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచాలని, భూసారాన్ని హరించే పత్తి వంటి పంటల సాగును తగ్గించి కంది, పెసర, మినుము వంటి పప్పుధాన్యాలతో పంట మార్పిడి చేపట్టాలని రైతులకు సూచించారు.

నేలల్లో భాస్వరం నిల్వలు అధికంగా ఉన్నందున డీఏపీ వంటి ఎరువుల వినియోగాన్ని తగ్గించి, భాస్వరాన్ని కరిగించే పాస్ఫో బ్యాక్టీరియాను పొలాల్లో వినియోగించాలని తెలిపారు. అలాగే నానో యూరియా, నానో డీఏపీ ఎరువులు సంప్రదాయ రసాయన ఎరువులకు సమర్థవంతమైన ప్రత్యామ్నాయాలని వివరించారు.

కార్యక్రమంలో పెద్దకాపర్తి సర్పంచ్ కాటం వెంకన్న, ఏఈఓ శిల్పతో పాటు గ్రామ రైతులు పాల్గొన్నారు. రైతులు శాస్త్రవేత్తలను వివిధ వ్యవసాయ సమస్యలపై ప్రశ్నించి సలహాలు తీసుకున్నారు.

Sthanikam

పెద్దకాపర్తిలో రైతులకు CRIDA శాస్త్రవేత్తల అవగాహన

Article Image


భూసార పరిరక్షణకు సమతుల్య ఎరువులు, పంట మార్పిడి అవసరం

రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ సాగుపై దృష్టి పెట్టాలని సూచన


చిట్యాల, జూలై 1:

హైదరాబాద్‌కు చెందిన మెట్ట పరిశోధన సంస్థ (CRIDA) శాస్త్రవేత్తలు బుధవారం చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో రైతులకు భూసార పరిరక్షణ, సుస్థిర వ్యవసాయ పద్ధతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. “కేత్ బచావో అభియాన్” మరియు “మేరా గావ్ మేరా గౌరవ్” కార్యక్రమాల కింద జరిగిన ఈ సమావేశంలో రైతులకు వ్యవసాయ భూముల సంరక్షణపై పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు డాక్టర్ గోష్, డాక్టర్ రవికాంత్, మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు మాట్లాడుతూ రైతులు అధికంగా రసాయన ఎరువులు వినియోగించడం వల్ల భూసారం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలకు సారవంతమైన నేలను అందించాలంటే సమతుల్య ఎరువుల వినియోగం, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని సూచించారు.

పెంట ఎరువు, పచ్చిరొట్టె ఎరువులు వంటి సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచాలని, భూసారాన్ని హరించే పత్తి వంటి పంటల సాగును తగ్గించి కంది, పెసర, మినుము వంటి పప్పుధాన్యాలతో పంట మార్పిడి చేపట్టాలని రైతులకు సూచించారు.

నేలల్లో భాస్వరం నిల్వలు అధికంగా ఉన్నందున డీఏపీ వంటి ఎరువుల వినియోగాన్ని తగ్గించి, భాస్వరాన్ని కరిగించే పాస్ఫో బ్యాక్టీరియాను పొలాల్లో వినియోగించాలని తెలిపారు. అలాగే నానో యూరియా, నానో డీఏపీ ఎరువులు సంప్రదాయ రసాయన ఎరువులకు సమర్థవంతమైన ప్రత్యామ్నాయాలని వివరించారు.

కార్యక్రమంలో పెద్దకాపర్తి సర్పంచ్ కాటం వెంకన్న, ఏఈఓ శిల్పతో పాటు గ్రామ రైతులు పాల్గొన్నారు. రైతులు శాస్త్రవేత్తలను వివిధ వ్యవసాయ సమస్యలపై ప్రశ్నించి సలహాలు తీసుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News