Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:04 AM

యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డుపై రాజ్‌గోపాల్ రెడ్డి అసంతృప్తి

యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డుపై రాజ్‌గోపాల్ రెడ్డి అసంతృప్తి

యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డుపై రాజ్‌గోపాల్ రెడ్డి అసంతృప్తి
01-07-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


"సీఎం వ్యవహారశైలి నచ్చలేదు.. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు విలువ లేదు" అంటూ ఘాటు వ్యాఖ్యలు


నల్గొండ:

యాదగిరిగుట్ట ధర్మకర్తల మండలి (ట్రస్ట్ బోర్డు) సభ్యుల నియామకంపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు.

"నేను సీనియర్ నాయకుడిని. గతంలో భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాను. నాకే చెప్పకుండా నిర్ణయాలు తీసుకుంటే ఎలా?" అని ప్రశ్నించారు.ముఖ్యమంత్రి వ్యవహారశైలి తనకు నచ్చకపోవడంతోనే ఇటీవల నల్లగొండలో జరిగిన సభకు హాజరుకాలేదని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేసిన అసలైన కాంగ్రెస్ నేతలకు ప్రస్తుతం తగిన ప్రాధాన్యం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

"కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు రోజురోజుకు కనుమరుగవుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన కొత్తవాళ్లకే ప్రాధాన్యం పెరిగింది. ఇప్పుడు అంతా వాళ్లదే నడుస్తోంది" అని విమర్శించారు.

అలాగే ముఖ్యమంత్రి వ్యవహారశైలిపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ, "సీఎం తీరు అస్సలు బాగోలేదు. షో-అప్స్ ఎక్కువయ్యాయి" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.రాజ్‌గోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు నియామకాల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Sthanikam

యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డుపై రాజ్‌గోపాల్ రెడ్డి అసంతృప్తి

Article Image


"సీఎం వ్యవహారశైలి నచ్చలేదు.. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు విలువ లేదు" అంటూ ఘాటు వ్యాఖ్యలు


నల్గొండ:

యాదగిరిగుట్ట ధర్మకర్తల మండలి (ట్రస్ట్ బోర్డు) సభ్యుల నియామకంపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు.

"నేను సీనియర్ నాయకుడిని. గతంలో భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాను. నాకే చెప్పకుండా నిర్ణయాలు తీసుకుంటే ఎలా?" అని ప్రశ్నించారు.ముఖ్యమంత్రి వ్యవహారశైలి తనకు నచ్చకపోవడంతోనే ఇటీవల నల్లగొండలో జరిగిన సభకు హాజరుకాలేదని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేసిన అసలైన కాంగ్రెస్ నేతలకు ప్రస్తుతం తగిన ప్రాధాన్యం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

"కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు రోజురోజుకు కనుమరుగవుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన కొత్తవాళ్లకే ప్రాధాన్యం పెరిగింది. ఇప్పుడు అంతా వాళ్లదే నడుస్తోంది" అని విమర్శించారు.

అలాగే ముఖ్యమంత్రి వ్యవహారశైలిపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ, "సీఎం తీరు అస్సలు బాగోలేదు. షో-అప్స్ ఎక్కువయ్యాయి" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.రాజ్‌గోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు నియామకాల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News