పౌర హక్కులపై అవగాహన కలిగి ఉండాలి’; ఎస్సై శ్రీకాంత్ కుమార్
పౌర హక్కులపై అవగాహన కలిగి ఉండాలి’; ఎస్సై శ్రీకాంత్ కుమార్
Bandi Kiran Kumar
పౌర హక్కులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని అన్నారం గ్రామంలో పోలీస్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో సివిల్ రైట్స్ డే’ (పౌర హక్కుల దినోత్సవం) ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ ప్రజలకు పౌర హక్కులపై అవగాహన కల్పించి మాట్లాడారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సమానమేనని, కుల వివక్షకు వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా నడవాలని పిలుపునిచ్చారు. చట్టం ముందు అందరూ సమానులేనని, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం, పౌర హక్కుల చట్టాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గ్రామంలో ఎలాంటి అంటరానితనం, వివక్షకు తావులేకుండా సామరస్యపూర్వక వాతావరణంలో జీవించాలని కోరారు. గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్న అధికారులు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అన్నారం గ్రామ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ అధికారులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి