Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:33 AM

పౌర హక్కులపై అవగాహన కలిగి ఉండాలి’; ఎస్సై శ్రీకాంత్ కుమార్

పౌర హక్కులపై అవగాహన కలిగి ఉండాలి’; ఎస్సై శ్రీకాంత్ కుమార్

పౌర హక్కులపై అవగాహన కలిగి ఉండాలి’; ఎస్సై శ్రీకాంత్ కుమార్
30-06-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

పౌర హక్కులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని అన్నారం గ్రామంలో పోలీస్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో సివిల్ రైట్స్ డే’ (పౌర హక్కుల దినోత్సవం) ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ ప్రజలకు పౌర హక్కులపై అవగాహన కల్పించి మాట్లాడారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సమానమేనని, కుల వివక్షకు వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా నడవాలని పిలుపునిచ్చారు. చట్టం ముందు అందరూ సమానులేనని, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం, పౌర హక్కుల చట్టాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గ్రామంలో ఎలాంటి అంటరానితనం, వివక్షకు తావులేకుండా సామరస్యపూర్వక వాతావరణంలో జీవించాలని కోరారు. గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్న అధికారులు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అన్నారం గ్రామ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ అధికారులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

పౌర హక్కులపై అవగాహన కలిగి ఉండాలి’; ఎస్సై శ్రీకాంత్ కుమార్

Article Image

పౌర హక్కులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని అన్నారం గ్రామంలో పోలీస్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో సివిల్ రైట్స్ డే’ (పౌర హక్కుల దినోత్సవం) ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ ప్రజలకు పౌర హక్కులపై అవగాహన కల్పించి మాట్లాడారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సమానమేనని, కుల వివక్షకు వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా నడవాలని పిలుపునిచ్చారు. చట్టం ముందు అందరూ సమానులేనని, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం, పౌర హక్కుల చట్టాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గ్రామంలో ఎలాంటి అంటరానితనం, వివక్షకు తావులేకుండా సామరస్యపూర్వక వాతావరణంలో జీవించాలని కోరారు. గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్న అధికారులు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అన్నారం గ్రామ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ అధికారులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News