Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గురువు ఋణం తీర్చుకున్న శిష్యుడు! ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ పుట్టపర్తిలో తల్లీబిడ్డ అదృశ్యం. రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 30, 2026 08:34 PM

పౌర హక్కులపై అవగాహన కలిగి ఉండాలి’; ఎస్సై శ్రీకాంత్ కుమార్

పౌర హక్కులపై అవగాహన కలిగి ఉండాలి’; ఎస్సై శ్రీకాంత్ కుమార్

పౌర హక్కులపై అవగాహన కలిగి ఉండాలి’; ఎస్సై శ్రీకాంత్ కుమార్
June 30, 2026 06:57 PM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

పౌర హక్కులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని అన్నారం గ్రామంలో పోలీస్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో సివిల్ రైట్స్ డే’ (పౌర హక్కుల దినోత్సవం) ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ ప్రజలకు పౌర హక్కులపై అవగాహన కల్పించి మాట్లాడారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సమానమేనని, కుల వివక్షకు వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా నడవాలని పిలుపునిచ్చారు. చట్టం ముందు అందరూ సమానులేనని, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం, పౌర హక్కుల చట్టాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గ్రామంలో ఎలాంటి అంటరానితనం, వివక్షకు తావులేకుండా సామరస్యపూర్వక వాతావరణంలో జీవించాలని కోరారు. గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్న అధికారులు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అన్నారం గ్రామ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ అధికారులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News