Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టైర్ పేలడంతో అదుపుతప్పిన బస్సు... డివైడర్ దాటి లారీని ఢీకొట్టిన ఘోర ప్రమాదం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 30, 2026 10:07 AM

ఒక్క అర్హ ఓటరూ జాబితా నుంచి తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలి: సిద్ధార్థ నాయుడు

ఒక్క అర్హ ఓటరూ జాబితా నుంచి తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలి: సిద్ధార్థ నాయుడు

ఒక్క అర్హ ఓటరూ జాబితా నుంచి తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలి: సిద్ధార్థ నాయుడు
June 30, 2026 07:40 AM 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని పట్టణంలోని 26వ వార్డు వెంకన్నపేట, నారాయణగుంత ప్రాంతాల్లో కొనసాగుతున్న SIR ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని ఆదోని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు సూచనల మేరకు, టీడీపీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు ఆదేశాల ప్రకారం యువ నాయకుడు సిద్ధార్థ నాయుడు, పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా BLO అధికారులతో మాట్లాడిన నాయకులు, ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియ పురోగతి, ఇంటింటి సర్వే పూర్తి స్థాయిలో జరుగుతోందా, అర్హులైన ప్రతి ఓటరు వివరాలు సక్రమంగా నమోదు అవుతున్నాయా, ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.

అలాగే అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా ప్రతి ఇంటిని సందర్శించి నిబంధనల ప్రకారం పారదర్శకంగా వెరిఫికేషన్ నిర్వహించాలని BLO అధికారులకు సూచించారు. ప్రజలు కూడా వెరిఫికేషన్ సమయంలో అధికారులకు పూర్తి సహకారం అందించి, అవసరమైన పత్రాలు సమర్పించి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున, శివ, రవి, సిద్ధ, శాంతమూర్తి, తిరుమల తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News