ఒక్క అర్హ ఓటరూ జాబితా నుంచి తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలి: సిద్ధార్థ నాయుడు
ఒక్క అర్హ ఓటరూ జాబితా నుంచి తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలి: సిద్ధార్థ నాయుడు
Editor Desk
ఆదోని పట్టణంలోని 26వ వార్డు వెంకన్నపేట, నారాయణగుంత ప్రాంతాల్లో కొనసాగుతున్న SIR ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని ఆదోని నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు సూచనల మేరకు, టీడీపీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు ఆదేశాల ప్రకారం యువ నాయకుడు సిద్ధార్థ నాయుడు, పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా BLO అధికారులతో మాట్లాడిన నాయకులు, ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియ పురోగతి, ఇంటింటి సర్వే పూర్తి స్థాయిలో జరుగుతోందా, అర్హులైన ప్రతి ఓటరు వివరాలు సక్రమంగా నమోదు అవుతున్నాయా, ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.
అలాగే అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా ప్రతి ఇంటిని సందర్శించి నిబంధనల ప్రకారం పారదర్శకంగా వెరిఫికేషన్ నిర్వహించాలని BLO అధికారులకు సూచించారు. ప్రజలు కూడా వెరిఫికేషన్ సమయంలో అధికారులకు పూర్తి సహకారం అందించి, అవసరమైన పత్రాలు సమర్పించి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున, శివ, రవి, సిద్ధ, శాంతమూర్తి, తిరుమల తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి