Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టైర్ పేలడంతో అదుపుతప్పిన బస్సు... డివైడర్ దాటి లారీని ఢీకొట్టిన ఘోర ప్రమాదం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 30, 2026 11:32 AM

ఎన్నారం రైతులకు షాక్.. ధాన్యం కొనుగోళ్లలో 48 బస్తాలు గల్లంతు!

ఎన్నారం రైతులకు షాక్.. ధాన్యం కొనుగోళ్లలో 48 బస్తాలు గల్లంతు!

ఎన్నారం రైతులకు షాక్.. ధాన్యం కొనుగోళ్లలో 48 బస్తాలు గల్లంతు!
June 30, 2026 09:31 AM 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ధాన్యం కొనుగోళ్లలో భారీ గోల్‌మాల్.. 48 బస్తాలు మాయం!

యాదాద్రి భువనగిరి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రంలో లెక్కించిన ధాన్యం బస్తాలు మిల్లుకు చేరేసరికి 48 బస్తాలు మాయమైన ఘటన రామన్నపేట మండలం ఎన్నారం గ్రామంలో వెలుగుచూసింది.

గ్రామానికి చెందిన రైతు ఏనుగు దామోదర్ రెడ్డితో పాటు మరికొందరు రైతులు తాము పండించిన రబీ వరి ధాన్యాన్ని స్థానిక పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో విక్రయించారు. అక్కడ అధికారులు ఒక్కో బస్తాకు 42 కిలోల చొప్పున మొత్తం 953 బస్తాలుగా లెక్కగట్టి లారీలో లోడ్ చేసి హనుమకొండ జిల్లాలోని ఓ రైస్ మిల్లుకు తరలించారు.

అయితే మిల్లులో అన్‌లోడ్ చేసిన అనంతరం కేవలం 905 బస్తాలు మాత్రమే వచ్చినట్లు ట్రక్ షీట్‌లో నమోదు చేశారు. తూకం వేయగా మొత్తం 37,870 కిలోల ధాన్యం మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో కొనుగోలు కేంద్రంలో లోడ్ చేసిన 953 బస్తాల్లో 48 బస్తాలు మాయమైనట్లు రైతులు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యమా, రవాణా చేసిన లారీ డ్రైవర్ చేతివాటమా, లేక మిల్లు యాజమాన్యం అక్రమాలకు పాల్పడిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకరిద్దరు రైతుల విషయంలోనే ఇంత పెద్ద ఎత్తున బస్తాలు మాయమైతే, మండల వ్యాప్తంగా మరెంతమంది రైతులు నష్టపోయి ఉంటారోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయమై స్థానిక అధికారులను ఆశ్రయించినప్పటికీ సరైన స్పందన లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రవాణా రికార్డులు, ట్రక్ రూట్ మ్యాప్, సంబంధిత పత్రాలను సమగ్రంగా పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వారు పేర్కొంటున్నారు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపి, మాయమైన ధాన్యం బస్తాలకు నష్టపరిహారం అందించడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నారం గ్రామ రైతులు డిమాండ్ చేస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News