Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:35 AM

తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర పదాధికారులకు నియామక పత్రాల అందజేత

తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర పదాధికారులకు నియామక పత్రాల అందజేత

తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర పదాధికారులకు నియామక పత్రాల అందజేత
29-06-2026 146 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ కమిటీ సభ్యుల సమావేశం ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ ప్రధాన కార్యదర్శి శెట్టి వెంకటేష్, జాతీయ సంయుక్త కార్యదర్శి తమ్మాలి సంగమేశ్వర్, జాతీయ ప్రచార కార్యదర్శి కర్చల సంగమేశ్వర్, జాతీయ కమిటీ సభ్యుడు వి. వెంకటేశం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం సంఘం రాష్ట్ర కమిటీ నియామకాలను ప్రకటించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బైండ్ల కృష్ణ, రాష్ట్ర కార్యదర్శిగా మన్నే నాగేష్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మన్నే పోచయ్య, రాష్ట్ర సలహాదారుగా బేగరి సంగమేశ్వర్‌లను నియమించారు. ఈ సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి శెట్టి వెంకటేష్ నూతనంగా నియమితులైన రాష్ట్ర పదాధికారులకు నియామక పత్రాలను అందజేసి అభినందనలు తెలిపారు. సంఘాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతం చేయడంతో పాటు జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం సమిష్టిగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పదాధికారులు తమపై ఉంచిన నమ్మకానికి జాతీయ కమిటీకి కృతజ్ఞతలు తెలుపుతూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిబద్ధతతో పనిచేస్తామని తెలిపారు.

Sthanikam

తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర పదాధికారులకు నియామక పత్రాల అందజేత

Article Image

తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ కమిటీ సభ్యుల సమావేశం ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ ప్రధాన కార్యదర్శి శెట్టి వెంకటేష్, జాతీయ సంయుక్త కార్యదర్శి తమ్మాలి సంగమేశ్వర్, జాతీయ ప్రచార కార్యదర్శి కర్చల సంగమేశ్వర్, జాతీయ కమిటీ సభ్యుడు వి. వెంకటేశం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం సంఘం రాష్ట్ర కమిటీ నియామకాలను ప్రకటించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బైండ్ల కృష్ణ, రాష్ట్ర కార్యదర్శిగా మన్నే నాగేష్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మన్నే పోచయ్య, రాష్ట్ర సలహాదారుగా బేగరి సంగమేశ్వర్‌లను నియమించారు. ఈ సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి శెట్టి వెంకటేష్ నూతనంగా నియమితులైన రాష్ట్ర పదాధికారులకు నియామక పత్రాలను అందజేసి అభినందనలు తెలిపారు. సంఘాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతం చేయడంతో పాటు జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం సమిష్టిగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పదాధికారులు తమపై ఉంచిన నమ్మకానికి జాతీయ కమిటీకి కృతజ్ఞతలు తెలుపుతూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిబద్ధతతో పనిచేస్తామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News