తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర పదాధికారులకు నియామక పత్రాల అందజేత
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర పదాధికారులకు నియామక పత్రాల అందజేత
Krishna
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ కమిటీ సభ్యుల సమావేశం ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ ప్రధాన కార్యదర్శి శెట్టి వెంకటేష్, జాతీయ సంయుక్త కార్యదర్శి తమ్మాలి సంగమేశ్వర్, జాతీయ ప్రచార కార్యదర్శి కర్చల సంగమేశ్వర్, జాతీయ కమిటీ సభ్యుడు వి. వెంకటేశం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం సంఘం రాష్ట్ర కమిటీ నియామకాలను ప్రకటించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బైండ్ల కృష్ణ, రాష్ట్ర కార్యదర్శిగా మన్నే నాగేష్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మన్నే పోచయ్య, రాష్ట్ర సలహాదారుగా బేగరి సంగమేశ్వర్లను నియమించారు. ఈ సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి శెట్టి వెంకటేష్ నూతనంగా నియమితులైన రాష్ట్ర పదాధికారులకు నియామక పత్రాలను అందజేసి అభినందనలు తెలిపారు. సంఘాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతం చేయడంతో పాటు జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం సమిష్టిగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పదాధికారులు తమపై ఉంచిన నమ్మకానికి జాతీయ కమిటీకి కృతజ్ఞతలు తెలుపుతూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిబద్ధతతో పనిచేస్తామని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి