టిట్కో కాలనీలో నివాసం ఉంటున్న 30 కుటుంబాలు ఆదివారం ఎమ్మెల్యే పార్థసారధి సమక్షంలో, యువ నాయకుడు హాజర్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరాయి. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ కో-కన్వీనర్ నాగరాజు గౌడ్ మాట్లాడుతూ, టిట్కో కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా మిగిలిన అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం దశలవారీగా పూర్తి చేస్తోందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర, మండల ప్రధాన కార్యదర్శి కోసిగయ్య, నాగేష్, దుర్గ కాలనీ వాసులు వీరేష్, మోహన్, లక్ష్మి, రమ, మారెమ్మ తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి