Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆహార పదార్థాల తయారీలో నాణ్యత పాటించాలి రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 28, 2026 09:08 PM

వెలిమినేడు పాల సంఘం డైరెక్టర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా.. భారీ మెజారిటీతో గడ్డం సూర్యప్రకాశ్ రెడ్డి విజయం

వెలిమినేడు పాల సంఘం డైరెక్టర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా.. భారీ మెజారిటీతో గడ్డం సూర్యప్రకాశ్ రెడ్డి విజయం

వెలిమినేడు పాల సంఘం డైరెక్టర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా.. భారీ మెజారిటీతో గడ్డం సూర్యప్రకాశ్ రెడ్డి విజయం
June 28, 2026 07:38 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, జూన్ 28:

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ పాల సంఘం డైరెక్టర్ పదవికి ఆదివారం జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గడ్డం సూర్యప్రకాశ్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎం అభ్యర్థులు బరిలో నిలవగా, పాడి రైతుల మద్దతుతో బీఆర్ఎస్ అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యాన్ని నమోదు చేశారు.ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుని విజయోత్సాహాన్ని పంచుకున్నారు. పాల సంఘం అభివృద్ధి, పాడి రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తామని విజేత గడ్డం సూర్యప్రకాశ్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా పాడి రైతులు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేసే నాయకత్వానికి మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు. గ్రామ ప్రజలు, రైతుల విశ్వాసంతో సాధించిన ఈ విజయం పాల సంఘం అభివృద్ధికి కొత్త ఊపునిస్తుందని బీఆర్ఎస్ నాయకులు అభిప్రాయపడ్డారు.విజయోత్సవ కార్యక్రమంలో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు అరూరి శ్రీశైలం, నాయకులు దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, నాతి శ్రీనివాస్, పైళ్ల రఘుమారెడ్డి, చిర్రబోయిన సురేష్, దేవిరెడ్డి సందీప్ రెడ్డి, బైకాని నరసింహ, దాసరి అయిలయ్య, వార్డు సభ్యులు ఏనుగు శ్రీకాంత్ రెడ్డి, గోలి అంజయ్య, పంది మణికంఠతో పాటు పార్టీ కార్యకర్తలు, పాడి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News