వెలిమినేడు పాల సంఘం డైరెక్టర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా.. భారీ మెజారిటీతో గడ్డం సూర్యప్రకాశ్ రెడ్డి విజయం
వెలిమినేడు పాల సంఘం డైరెక్టర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా.. భారీ మెజారిటీతో గడ్డం సూర్యప్రకాశ్ రెడ్డి విజయం
Komidala Mahender reddy
చిట్యాల, జూన్ 28:
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ పాల సంఘం డైరెక్టర్ పదవికి ఆదివారం జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గడ్డం సూర్యప్రకాశ్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎం అభ్యర్థులు బరిలో నిలవగా, పాడి రైతుల మద్దతుతో బీఆర్ఎస్ అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యాన్ని నమోదు చేశారు.ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుని విజయోత్సాహాన్ని పంచుకున్నారు. పాల సంఘం అభివృద్ధి, పాడి రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తామని విజేత గడ్డం సూర్యప్రకాశ్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా పాడి రైతులు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేసే నాయకత్వానికి మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు. గ్రామ ప్రజలు, రైతుల విశ్వాసంతో సాధించిన ఈ విజయం పాల సంఘం అభివృద్ధికి కొత్త ఊపునిస్తుందని బీఆర్ఎస్ నాయకులు అభిప్రాయపడ్డారు.విజయోత్సవ కార్యక్రమంలో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు అరూరి శ్రీశైలం, నాయకులు దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, నాతి శ్రీనివాస్, పైళ్ల రఘుమారెడ్డి, చిర్రబోయిన సురేష్, దేవిరెడ్డి సందీప్ రెడ్డి, బైకాని నరసింహ, దాసరి అయిలయ్య, వార్డు సభ్యులు ఏనుగు శ్రీకాంత్ రెడ్డి, గోలి అంజయ్య, పంది మణికంఠతో పాటు పార్టీ కార్యకర్తలు, పాడి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి