పోలియో రహిత సమాజమే లక్ష్యం: సర్పంచ్ ఈడం రాధా శ్రీనివాస్.
పోలియో రహిత సమాజమే లక్ష్యం: సర్పంచ్ ఈడం రాధా శ్రీనివాస్.
Editor Desk
రామన్నపేట మండలంలోని ఎల్లంకి గ్రామంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఈడం రాధా శ్రీనివాస్ ప్రారంభించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన కేంద్రంలో 0 నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ఈడం రాధా శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. ఒక్క చిన్నారిని కూడా వదిలిపెట్టకుండా పోలియో చుక్కలు వేయించేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ మిర్యాల రాజ్కుమార్, వార్డు సభ్యులు లింగయ్య, రాజలింగం, డాక్టర్ శివసాయి, ఏఎన్ఎం పావని, ఆశా వర్కర్ సుగుణ, అంగన్వాడీ టీచర్లు అలివేలు, భాగ్యలక్ష్మి, జీనుక శేఖర్, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి