Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:45 AM

హెలెన్ కెల్లర్ ఆశయాలు ఆచరణలోకి రావాలి.

హెలెన్ కెల్లర్ ఆశయాలు ఆచరణలోకి రావాలి.

హెలెన్ కెల్లర్ ఆశయాలు ఆచరణలోకి రావాలి.
28-06-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: వికలాంగులు, వృద్ధులు, వితంతువుల సంక్షేమానికి ప్రభుత్వాలు మాటలు కాకుండా చేతల్లో చూపాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నాయకులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శనివారం హెలెన్ కెల్లర్ 146వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ, పుట్టుకతోనే అంధురాలు, బధిరురాలైన హెలెన్ కెల్లర్ పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. వికలాంగులు ఆమె జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని తమ హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు.


కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని, ప్రస్తుతం అందుతున్న పింఛన్లను పెంచాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్యక్రమానికి మండల ఉపాధ్యక్షుడు నాగు నరసింహ అధ్యక్షత వహించగా, పున్న శ్రీధర్, చంద్రశేఖర్, నరసింహ, మచ్చగిరి, అంజయ్య, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

హెలెన్ కెల్లర్ ఆశయాలు ఆచరణలోకి రావాలి.

Article Image

రామన్నపేట: వికలాంగులు, వృద్ధులు, వితంతువుల సంక్షేమానికి ప్రభుత్వాలు మాటలు కాకుండా చేతల్లో చూపాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నాయకులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శనివారం హెలెన్ కెల్లర్ 146వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ, పుట్టుకతోనే అంధురాలు, బధిరురాలైన హెలెన్ కెల్లర్ పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. వికలాంగులు ఆమె జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని తమ హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు.


కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని, ప్రస్తుతం అందుతున్న పింఛన్లను పెంచాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్యక్రమానికి మండల ఉపాధ్యక్షుడు నాగు నరసింహ అధ్యక్షత వహించగా, పున్న శ్రీధర్, చంద్రశేఖర్, నరసింహ, మచ్చగిరి, అంజయ్య, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News