హెలెన్ కెల్లర్ ఆశయాలు ఆచరణలోకి రావాలి.
హెలెన్ కెల్లర్ ఆశయాలు ఆచరణలోకి రావాలి.
Editor Desk
రామన్నపేట: వికలాంగులు, వృద్ధులు, వితంతువుల సంక్షేమానికి ప్రభుత్వాలు మాటలు కాకుండా చేతల్లో చూపాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నాయకులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శనివారం హెలెన్ కెల్లర్ 146వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ, పుట్టుకతోనే అంధురాలు, బధిరురాలైన హెలెన్ కెల్లర్ పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. వికలాంగులు ఆమె జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని తమ హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని, ప్రస్తుతం అందుతున్న పింఛన్లను పెంచాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్యక్రమానికి మండల ఉపాధ్యక్షుడు నాగు నరసింహ అధ్యక్షత వహించగా, పున్న శ్రీధర్, చంద్రశేఖర్, నరసింహ, మచ్చగిరి, అంజయ్య, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి