PRINT TIME: June 28, 2026 01:38 PM
నారాయణపురంలో పల్స్ పోలియోకు శ్రీకారం చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన టీడీపీ నేత ఉమాపతి నాయుడు
నారాయణపురంలో పల్స్ పోలియోకు శ్రీకారం చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన టీడీపీ నేత ఉమాపతి నాయుడు
June 28, 2026 11:31 AM
19 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఆదోని, జూన్ 28: మండలంలోని నారాయణపురం గ్రామంలో ఆదివారం జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదోని నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడుతూ, ప్రతి చిన్నారి పోలియో రహిత భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాలకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి