Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలియోను తరిమికొడదాం చిన్నారుల భవిష్యత్తును కాపాడుదాం; సర్పంచ్ బీకోజీ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 28, 2026 01:49 PM

మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన గొరిగే శేఖర్‌కు కాంగ్రెస్ సన్మానం

మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన గొరిగే శేఖర్‌కు కాంగ్రెస్ సన్మానం

మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన గొరిగే శేఖర్‌కు కాంగ్రెస్ సన్మానం
June 28, 2026 06:46 AM 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: రామన్నపేట పట్టణ పాల సంఘం చైర్మన్‌గా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ నాయకుడు గొరిగే శేఖర్‌ను పట్టణ కాంగ్రెస్ నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించి స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ జమీరుద్దీన్ మాట్లాడుతూ, శేఖర్ వరుసగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఆయన సేవలకు ప్రజలు ఇచ్చిన గుర్తింపని అన్నారు. భవిష్యత్తులోనూ పాల సంఘం అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోటి రమేష్, వనం చంద్రశేఖర్, మాజీ ఎంపీటీసీ సాల్వేర్ అశోక్, కాంగ్రెస్ నాయకులు అక్రమ్, బొడ్డు సాలయ్య, నాసర్, గోదాసు శివనారాయణ, కొమ్ము నాగరాజు, గొలుసుల ప్రసాద్, వార్డు సభ్యులు అంజద్, కరీం, అజార్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News