PRINT TIME: June 28, 2026 01:49 PM
మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన గొరిగే శేఖర్కు కాంగ్రెస్ సన్మానం
మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన గొరిగే శేఖర్కు కాంగ్రెస్ సన్మానం
June 28, 2026 06:46 AM
23 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట: రామన్నపేట పట్టణ పాల సంఘం చైర్మన్గా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ నాయకుడు గొరిగే శేఖర్ను పట్టణ కాంగ్రెస్ నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించి స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ జమీరుద్దీన్ మాట్లాడుతూ, శేఖర్ వరుసగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఆయన సేవలకు ప్రజలు ఇచ్చిన గుర్తింపని అన్నారు. భవిష్యత్తులోనూ పాల సంఘం అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోటి రమేష్, వనం చంద్రశేఖర్, మాజీ ఎంపీటీసీ సాల్వేర్ అశోక్, కాంగ్రెస్ నాయకులు అక్రమ్, బొడ్డు సాలయ్య, నాసర్, గోదాసు శివనారాయణ, కొమ్ము నాగరాజు, గొలుసుల ప్రసాద్, వార్డు సభ్యులు అంజద్, కరీం, అజార్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి