ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి
Krishna
నారాయణఖేడ్ మున్సిపల్ 9వ వార్డులో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహించిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొని సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతి, యువకుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోయినా లేదా వివరాల్లో తప్పులు ఉన్నా ఈ ప్రత్యేక సర్వే ద్వారా సరిచేసుకోవాలని సూచించారు. బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైన వారిని గుర్తించి పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించాలని, ప్రజలు, స్థానిక నాయకులు సర్వే అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వాస్పరి ప్రశాంతి, మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, కౌన్సిలర్లు, బీఎల్ఓలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి