Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:33 AM

ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి
27-06-2026 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ 9వ వార్డులో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహించిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొని సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతి, యువకుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోయినా లేదా వివరాల్లో తప్పులు ఉన్నా ఈ ప్రత్యేక సర్వే ద్వారా సరిచేసుకోవాలని సూచించారు. బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైన వారిని గుర్తించి పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించాలని, ప్రజలు, స్థానిక నాయకులు సర్వే అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వాస్పరి ప్రశాంతి, మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, కౌన్సిలర్లు, బీఎల్ఓలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

Article Image

నారాయణఖేడ్ మున్సిపల్ 9వ వార్డులో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహించిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొని సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతి, యువకుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోయినా లేదా వివరాల్లో తప్పులు ఉన్నా ఈ ప్రత్యేక సర్వే ద్వారా సరిచేసుకోవాలని సూచించారు. బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైన వారిని గుర్తించి పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించాలని, ప్రజలు, స్థానిక నాయకులు సర్వే అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వాస్పరి ప్రశాంతి, మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, కౌన్సిలర్లు, బీఎల్ఓలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News