Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేయొద్దు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 27, 2026 05:12 PM

విద్యార్థులకు న్యాయ పాఠాలు. పోక్సో, సైబర్ భద్రతపై అవగాహన.

విద్యార్థులకు న్యాయ పాఠాలు. పోక్సో, సైబర్ భద్రతపై అవగాహన.

విద్యార్థులకు న్యాయ పాఠాలు.  పోక్సో, సైబర్ భద్రతపై అవగాహన.
June 27, 2026 03:23 PM 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

విద్యార్థులు తమ హక్కులు, విధులపై అవగాహన పెంచుకొని బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శిరీష అన్నారు. మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. రాజ్యాంగ విలువలు, బాలల హక్కులు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పోక్సో చట్టం, సేఫ్ టచ్–అన్‌సేఫ్ టచ్, సైబర్ భద్రత తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. న్యాయ సమస్యలు ఎదురైనప్పుడు లీగల్ సర్వీసెస్ సంస్థలు అందించే ఉచిత న్యాయ సహాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్యానెల్ అడ్వకేట్ కూనూరు శ్రీనివాస్, ఉపాధ్యాయులు, లీగల్ సర్వీసెస్ కమిటీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News