PRINT TIME: June 27, 2026 05:12 PM
విద్యార్థులకు న్యాయ పాఠాలు. పోక్సో, సైబర్ భద్రతపై అవగాహన.
విద్యార్థులకు న్యాయ పాఠాలు. పోక్సో, సైబర్ భద్రతపై అవగాహన.
June 27, 2026 03:23 PM
20 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట,
విద్యార్థులు తమ హక్కులు, విధులపై అవగాహన పెంచుకొని బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శిరీష అన్నారు. మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. రాజ్యాంగ విలువలు, బాలల హక్కులు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పోక్సో చట్టం, సేఫ్ టచ్–అన్సేఫ్ టచ్, సైబర్ భద్రత తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. న్యాయ సమస్యలు ఎదురైనప్పుడు లీగల్ సర్వీసెస్ సంస్థలు అందించే ఉచిత న్యాయ సహాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్యానెల్ అడ్వకేట్ కూనూరు శ్రీనివాస్, ఉపాధ్యాయులు, లీగల్ సర్వీసెస్ కమిటీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి