Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కూనురి గోపాల్ గౌడ్‌కు చిరుమర్తి లింగయ్య నివాళి. డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 26, 2026 06:31 PM

మత్తుకు దూరం.. ప్రగతికి మార్గం!

మత్తుకు దూరం.. ప్రగతికి మార్గం!

మత్తుకు దూరం.. ప్రగతికి మార్గం!
June 26, 2026 05:09 PM 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* యువత సన్మార్గాన నడిస్తేనే దేశ భవిష్యత్తు బలపడుతుంది

​* హోమియోపతి వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డా. శివ ప్రసాద్

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే దేశ భవిష్యత్తు బలపడుతుందని తెలంగాణ హోమియోపతి వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డా. శివ ప్రసాద్ అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ.. నేటి సమాజంలో యువతను పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రతి ఒక్కరిలో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.​మాదకద్రవ్యాల వినియోగం కేవలం వ్యక్తుల ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా.. పచ్చని కుటుంబ వ్యవస్థను, సమాజాన్ని, దేశ ప్రగతిని తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల నిర్మూలన కేవలం ఒక్కరితో సాధ్యం కాదు. ప్రభుత్వం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు సమాజంలోని ప్రతి ఒక్కరూ సమిష్టిగా బాధ్యత తీసుకుని పనిచేయాలి. 'మత్తుకు కాదు... జీవితానికి అవును' అనే నినాదంతో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలి. ముఖ్యంగా విద్యార్థులు, యువత చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా.. విద్య, క్రీడలు, నైతిక విలువలు, సేవా కార్యక్రమాల వైపు దృష్టి సారించాలని డా. శివ ప్రసాద్ సూచించారు. యువత తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకునే మత్తు లోకం నుంచి బయటకు వచ్చి, సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News