Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భక్తుల కోలాహలంతో వైభవంగా ముగిసిన బోరంచ మొహర్రం పీర్ల ఊరేగింపు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 26, 2026 07:53 PM

కేజీబీవీలో ఆకస్మిక తనిఖీ. సౌకర్యాలపై ఆరా తీసిన అదనపు కలెక్టర్.

కేజీబీవీలో ఆకస్మిక తనిఖీ. సౌకర్యాలపై ఆరా తీసిన అదనపు కలెక్టర్.

కేజీబీవీలో ఆకస్మిక తనిఖీ.  సౌకర్యాలపై ఆరా తీసిన అదనపు కలెక్టర్.
June 26, 2026 03:49 PM 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. విద్యార్థినులకు అందుతున్న విద్య, వసతి, తాగునీరు, భోజన నాణ్యత, పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

విద్యార్థినులతో నేరుగా మాట్లాడిన అదనపు కలెక్టర్ వారి విద్యాభ్యాసం, ఆరోగ్యం, వసతి సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలతో చదువులో రాణించాలని సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News