భువనగిరి పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. విద్యార్థినులకు అందుతున్న విద్య, వసతి, తాగునీరు, భోజన నాణ్యత, పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
విద్యార్థినులతో నేరుగా మాట్లాడిన అదనపు కలెక్టర్ వారి విద్యాభ్యాసం, ఆరోగ్యం, వసతి సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలతో చదువులో రాణించాలని సూచించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి