PRINT TIME: June 25, 2026 10:35 PM
మొహర్రం వేడుకల్లో భక్తిశ్రద్ధలతో బీపాత్మ పీర్లకు మొక్కులు సమర్పించిన భక్తులు
మొహర్రం వేడుకల్లో భక్తిశ్రద్ధలతో బీపాత్మ పీర్లకు మొక్కులు సమర్పించిన భక్తులు
June 25, 2026 09:00 PM
78 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామంలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న మొహర్రం పండుగ సందర్భంగా గురువారం దుందేకుళ మసీదు వద్ద బీపాత్మ పీర్లకు గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత, మహిళలు, చిన్నా పెద్దా తేడా లేకుండా భారీ సంఖ్యలో పాల్గొని మొక్కులు సమర్పించారు. అనంతరం పీర్లను గ్రామ వీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లి ఆటపాటలతో ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. తిరిగి మసీదు చేరుకున్న తర్వాత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా, బీపాత్మ పీర్ల ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉంటాయని, భక్తితో కోరుకున్న మొక్కులు నెరవేరుతాయని మసీదు నిర్వాహకులు తెలిపారు. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పీర్ల ఆశీర్వాదాలు పొందారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి