ఇంద్రపాలనగరం పాల సంఘం చైర్మన్గా శ్రీశైలం యాదవ్.
ఇంద్రపాలనగరం పాల సంఘం చైర్మన్గా శ్రీశైలం యాదవ్.
Editor Desk
నల్లగొండ–రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఇంద్రపాలనగరం శాఖ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. సంఘం నూతన చైర్మన్గా కంబాలపల్లి శ్రీశైలం యాదవ్ ఎన్నికయ్యారు.
అదేవిధంగా డైరెక్టర్లుగా సింగననబోయిన శ్రీను, రాజన్నగారి అలివేలు ఎన్నికయ్యారు. తమ ఎన్నికకు సహకరించిన ఓటర్లకు నూతనంగా ఎన్నికైన చైర్మన్, డైరెక్టర్లు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా వారిని సన్మానించిన గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ మాట్లాడుతూ పాల ఉత్పత్తిదారుల సంక్షేమం, రైతుల అభివృద్ధికి సంఘం కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఎన్నికల విజయానికి సహకరించిన డైరెక్టర్లు గర్ధాస్ దామోదర్, కొలగాని పాండు, సింగనబోయిన అశోక్, పగుడాల రవిశంకర్, గొర్ల సత్యనారాయణ, గర్ధాస్ వెంకటేశం, 11వ వార్డు సభ్యుడు వరికుప్పల స్వామి, మాజీ ఉపసర్పంచ్ గర్ధాస్ వెంకటేష్తో పాటు ఎన్నికల అధికారి తవుటం బిక్షపతి, మంటి అంజయ్యలకు నూతన చైర్మన్, డైరెక్టర్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి