Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:10 AM

రామలింగేశ్వర ఆలయంలో నవగ్రహ మండప శంకుస్థాపన

రామలింగేశ్వర ఆలయంలో నవగ్రహ మండప శంకుస్థాపన

రామలింగేశ్వర ఆలయంలో నవగ్రహ మండప శంకుస్థాపన
24-06-2026 183 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* కీ.శే. ఊర నరసింహ గుప్త జ్ఞాపకార్థం దాతల పూజలు

* భక్తిశ్రద్ధలతో వేడుక.. తరలివచ్చిన భక్తులు

మండల పరిధిలోని చిన్నకొండూరు గ్రామంలో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నవగ్రహ మండప నిర్మాణ శంకుస్థాపన మంగళవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. కీర్తిశేషులు ఊర నరసింహ గుప్త జ్ఞాపకార్థం ప్రముఖ దాతలు ఉప్పల ప్రవీణ్ కుమార్ గుప్త – కళ్యాణి దంపతులు ఈ నవగ్రహ మండప నిర్మాణానికి చేపట్టారు. ఈ సందర్భంగా వారి కుమార్తెలు శృతిక, కార్తిక వేద పండితుల మంత్రోచ్చారణలు, విశేష పూజల మధ్య మండప నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

​అనంతరం దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధిలో భాగస్వామ్యమై తమ వంతు ఆధ్యాత్మిక సేవ అందించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ​భక్తుల సహకారంతోనే ఆలయాలు మరింత అభివృద్ధి చెందుతాయని దేవాలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. నవగ్రహ మండపం అందుబాటులోకి వస్తే భక్తులకు మరింత ఆధ్యాత్మిక వాతావరణం లభిస్తుందని, దాత కుటుంబం చేసిన ఈ సేవ ఎందరికో ఆదర్శప్రాయమని కొనియాడారు.​ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఎరుకల రామదాసు గౌడ్, గ్రామ సర్పంచ్ తిగుళ్ల చంద్రయ్య, ఉప సర్పంచ్ గడ్డం సత్తయ్య, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

రామలింగేశ్వర ఆలయంలో నవగ్రహ మండప శంకుస్థాపన

Article Image

* కీ.శే. ఊర నరసింహ గుప్త జ్ఞాపకార్థం దాతల పూజలు

* భక్తిశ్రద్ధలతో వేడుక.. తరలివచ్చిన భక్తులు

మండల పరిధిలోని చిన్నకొండూరు గ్రామంలో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నవగ్రహ మండప నిర్మాణ శంకుస్థాపన మంగళవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. కీర్తిశేషులు ఊర నరసింహ గుప్త జ్ఞాపకార్థం ప్రముఖ దాతలు ఉప్పల ప్రవీణ్ కుమార్ గుప్త – కళ్యాణి దంపతులు ఈ నవగ్రహ మండప నిర్మాణానికి చేపట్టారు. ఈ సందర్భంగా వారి కుమార్తెలు శృతిక, కార్తిక వేద పండితుల మంత్రోచ్చారణలు, విశేష పూజల మధ్య మండప నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

​అనంతరం దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధిలో భాగస్వామ్యమై తమ వంతు ఆధ్యాత్మిక సేవ అందించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ​భక్తుల సహకారంతోనే ఆలయాలు మరింత అభివృద్ధి చెందుతాయని దేవాలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. నవగ్రహ మండపం అందుబాటులోకి వస్తే భక్తులకు మరింత ఆధ్యాత్మిక వాతావరణం లభిస్తుందని, దాత కుటుంబం చేసిన ఈ సేవ ఎందరికో ఆదర్శప్రాయమని కొనియాడారు.​ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఎరుకల రామదాసు గౌడ్, గ్రామ సర్పంచ్ తిగుళ్ల చంద్రయ్య, ఉప సర్పంచ్ గడ్డం సత్తయ్య, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News