రామలింగేశ్వర ఆలయంలో నవగ్రహ మండప శంకుస్థాపన
రామలింగేశ్వర ఆలయంలో నవగ్రహ మండప శంకుస్థాపన
K.RAVI
* కీ.శే. ఊర నరసింహ గుప్త జ్ఞాపకార్థం దాతల పూజలు
* భక్తిశ్రద్ధలతో వేడుక.. తరలివచ్చిన భక్తులు
మండల పరిధిలోని చిన్నకొండూరు గ్రామంలో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నవగ్రహ మండప నిర్మాణ శంకుస్థాపన మంగళవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. కీర్తిశేషులు ఊర నరసింహ గుప్త జ్ఞాపకార్థం ప్రముఖ దాతలు ఉప్పల ప్రవీణ్ కుమార్ గుప్త – కళ్యాణి దంపతులు ఈ నవగ్రహ మండప నిర్మాణానికి చేపట్టారు. ఈ సందర్భంగా వారి కుమార్తెలు శృతిక, కార్తిక వేద పండితుల మంత్రోచ్చారణలు, విశేష పూజల మధ్య మండప నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధిలో భాగస్వామ్యమై తమ వంతు ఆధ్యాత్మిక సేవ అందించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. భక్తుల సహకారంతోనే ఆలయాలు మరింత అభివృద్ధి చెందుతాయని దేవాలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. నవగ్రహ మండపం అందుబాటులోకి వస్తే భక్తులకు మరింత ఆధ్యాత్మిక వాతావరణం లభిస్తుందని, దాత కుటుంబం చేసిన ఈ సేవ ఎందరికో ఆదర్శప్రాయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఎరుకల రామదాసు గౌడ్, గ్రామ సర్పంచ్ తిగుళ్ల చంద్రయ్య, ఉప సర్పంచ్ గడ్డం సత్తయ్య, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి