Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మల్కాపూర్‌లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి.. సీజనల్ వ్యాధుల నివారణకు సర్పంచ్ అనిల్ కుమార్ చర్యలు "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 11, 2026 06:45 PM

దారి అడిగిన రైతులు.. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయింపు

దారి అడిగిన రైతులు.. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయింపు

దారి అడిగిన రైతులు.. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయింపు
June 11, 2026 04:40 PM 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాలలో నేరడ మహిళలు, రైతుల ఆందోళన – ‘ఫిర్యాదు ఎవరు చేశారో చెప్పండి’ అంటూ పోలీసులను నిలదీత


నల్గొండ జిల్లా: చిట్యాల

గ్రామానికి వెళ్లే దారి సమస్య పరిష్కారం కాకపోగా, తమను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వేధిస్తున్నారంటూ నేరడ గ్రామానికి చెందిన మహిళలు, రైతులు చిట్యాల పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. సుమారు 50 కుటుంబాలకు చెందిన మహిళలు, రైతులు బైఠాయించి పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

గాదిరెడ్డిపల్లి నుంచి నేరడ గ్రామానికి వెళ్లే పాత రైతుల దారికి అడ్డంగా బ్రాహ్మణ వెల్లంల కాల్వ నిర్మాణం చేపట్టడంతో రాకపోకలు నిలిచిపోయాయని గ్రామస్థులు తెలిపారు. గతంలో సమస్యపై ఆందోళనలు జరగడంతో కాల్వపై బ్రిడ్జి నిర్మిస్తామని హామీలు ఇచ్చినా అమలు కాలేదని పేర్కొన్నారు.

రైతుల విజ్ఞప్తి మేరకు తాత్కాలిక దారి కోసం మంజూరైన సిమెంట్ గుణా పైపులు కూడా దారి నిర్మాణానికి వినియోగించకుండా కొందరు స్థానిక నాయకులు అమ్ముకున్నారని గ్రామస్థులు ఆరోపించారు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల కాల్వను పూడ్చివేసి ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేశారనే ఆరోపణలతో పోలీసులు నేరడ గ్రామానికి చెందిన కుటుంబాలను స్టేషన్‌కు పిలిపించారు. అయితే తాము ఎలాంటి తప్పు చేయలేదని, దారి కోసం మాత్రమే పోరాడుతున్నామని మహిళలు స్పష్టం చేశారు.“మాపై ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎవరు? ఏ కారణంతో కేసులు పెడుతున్నారు?” అని ప్రశ్నించినా పోలీసులు సరైన సమాధానం ఇవ్వలేదని మహిళలు ఆరోపించారు. స్థానిక రాజకీయ నాయకుల మాటలు విని రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

గ్రామంలో దారి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, పైపుల వ్యవహారంపై విచారణ జరిపించాలని, రైతులు–మహిళలపై వేధింపులు నిలిపివేయాలని జిల్లా అధికారులను కోరారు. ప్రస్తుతం ఈ ఘటనతో చిట్యాల పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News