Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:53 PM

విద్యార్థుల భద్రతే లక్ష్యం – పాఠశాల ఆవరణలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు

విద్యార్థుల భద్రతే లక్ష్యం – పాఠశాల ఆవరణలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు

విద్యార్థుల భద్రతే లక్ష్యం – పాఠశాల ఆవరణలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు
11-06-2026 145 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జూన్ 15 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు డాగ్ స్క్వాడ్ బృందం నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించింది. గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరిమ్ సమక్షంలో తరగతి గదులు, పాఠశాల ఆవరణ, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి భద్రతా పరిస్థితులను తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యా కార్యక్రమాలు ప్రారంభించేందుకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా చేపట్టిన ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గుర్తించబడలేదని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానూర్ పోలీస్ సిబ్బంది, గ్రామ వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థుల భద్రతే లక్ష్యం – పాఠశాల ఆవరణలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు

Article Image

జూన్ 15 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు డాగ్ స్క్వాడ్ బృందం నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించింది. గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరిమ్ సమక్షంలో తరగతి గదులు, పాఠశాల ఆవరణ, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి భద్రతా పరిస్థితులను తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యా కార్యక్రమాలు ప్రారంభించేందుకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా చేపట్టిన ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గుర్తించబడలేదని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానూర్ పోలీస్ సిబ్బంది, గ్రామ వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News