విద్యార్థుల భద్రతే లక్ష్యం – పాఠశాల ఆవరణలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు
విద్యార్థుల భద్రతే లక్ష్యం – పాఠశాల ఆవరణలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు
Krishna
జూన్ 15 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు డాగ్ స్క్వాడ్ బృందం నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించింది. గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరిమ్ సమక్షంలో తరగతి గదులు, పాఠశాల ఆవరణ, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి భద్రతా పరిస్థితులను తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యా కార్యక్రమాలు ప్రారంభించేందుకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా చేపట్టిన ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గుర్తించబడలేదని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానూర్ పోలీస్ సిబ్బంది, గ్రామ వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి