Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రొద్దంలో ఉషశ్రీపై మండల కూటమి నాయకుల ఫైర్ "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 13, 2026 06:03 PM

మిలిగిరిపేట వాగు ప్రాంతంలో మొసలి పిల్లల కలకలం.. భయాందోళనలో గ్రామస్తులు

మిలిగిరిపేట వాగు ప్రాంతంలో మొసలి పిల్లల కలకలం.. భయాందోళనలో గ్రామస్తులు

మిలిగిరిపేట వాగు ప్రాంతంలో మొసలి పిల్లల కలకలం.. భయాందోళనలో గ్రామస్తులు
June 08, 2026 09:43 PM 339 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట మండలం మిలిగిరిపేట గ్రామ పరిధిలోని వాగు ప్రాంతంలో మొసలి పిల్లలు కనిపించడంతో గ్రామంలో కలకలం రేగింది. వాగు సమీపంలోని పొలంలో భూమి కొలతల పనులు నిర్వహిస్తున్న సమయంలో భూమిలో నుంచి మొసలి పిల్లలు బయటకు వస్తుండటాన్ని గమనించిన కార్మికులు భయాందోళనకు గురై వెంటనే గ్రామ సర్పంచ్ షాబుద్దీన్‌కు సమాచారం అందించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్న సర్పంచ్ పరిస్థితిని పరిశీలించగా, సుమారు 20 మొసలి పిల్లలు గుడ్ల నుంచి బయటకు వచ్చినట్లు ఆనవాళ్లు కనిపించాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని మొసలి పిల్లలను స్వాధీనం చేసుకుని సురక్షిత ప్రాంతానికి తరలించారు. సమీపంలోని చెరువు, వాగు ప్రాంతాల్లో మరిన్ని మొసళ్లు లేదా గుడ్లు ఉండే అవకాశం ఉందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తూ, అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలనలు నిర్వహించి ప్రజల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వాగు, చెరువు పరిసర ప్రాంతాలకు వెళ్లే రైతులు, కూలీలు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని సర్పంచ్ షాబుద్దీన్ సూచించారు. ఈ ఘటనతో గ్రామంలో కొంత ఆందోళన నెలకొన్నప్పటికీ, అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టడం పట్ల గ్రామస్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News