Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నూతన బాధ్యతలు చేపట్టిన రాజు పటేల్‌కు ఘన స్వాగతం కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 04, 2026 05:02 AM

మూడోసారి క్యాబినెట్ మంత్రి అయిన ఈశ్వర్ ఖండ్రేకు సంగారెడ్డి వీరశైవ నాయకుల అభినందనలు

మూడోసారి క్యాబినెట్ మంత్రి అయిన ఈశ్వర్ ఖండ్రేకు సంగారెడ్డి వీరశైవ నాయకుల అభినందనలు

మూడోసారి క్యాబినెట్ మంత్రి అయిన ఈశ్వర్ ఖండ్రేకు సంగారెడ్డి వీరశైవ నాయకుల అభినందనలు
June 03, 2026 06:30 PM 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మూడోసారి క్యాబినెట్ మంత్రిగా అవకాశం దక్కించుకున్న బాల్కి ఎమ్మెల్యే, ఆల్ ఇండియా వీరశైవ మహాసభ అధ్యక్షుడు ఈశ్వర్ ఖండ్రేను సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ సమాజ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి అనిశెట్టి జయప్రకాష్ మాట్లాడుతూ వీరశైవ లింగాయత్ సమాజానికి చెందిన నాయకుడిగా ఈశ్వర్ ఖండ్రే మరోసారి క్యాబినెట్ హోదా పొందడం గర్వకారణమన్నారు. ప్రజాసేవ, సమాజ అభ్యున్నతి పట్ల ఆయన చూపుతున్న కృషికి గుర్తింపుగానే ఈ అవకాశం లభించిందని పేర్కొన్నారు. అలాగే ఈ గౌరవప్రదమైన అవకాశాన్ని కల్పించిన డి.కె. శివకుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈశ్వర్ ఖండ్రే తన పదవిలో మరింత సమర్థవంతంగా పనిచేస్తూ ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, వీరశైవ లింగాయత్ సమాజ పురోగతికి విశేష సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వీరశైవ లింగాయత్ సమాజ రాష్ట్ర నాయకులు సిహెచ్ బసవరాజ్, సులగంటి సిద్ధేశ్వర్, శివరాజ్ పాటిల్, సదాశివపేట అధ్యక్షుడు గందిగా రాజు, జిల్లా యువజన అధ్యక్షుడు బుగ్గన మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News