మూడోసారి క్యాబినెట్ మంత్రి అయిన ఈశ్వర్ ఖండ్రేకు సంగారెడ్డి వీరశైవ నాయకుల అభినందనలు
మూడోసారి క్యాబినెట్ మంత్రి అయిన ఈశ్వర్ ఖండ్రేకు సంగారెడ్డి వీరశైవ నాయకుల అభినందనలు
Krishna
కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మూడోసారి క్యాబినెట్ మంత్రిగా అవకాశం దక్కించుకున్న బాల్కి ఎమ్మెల్యే, ఆల్ ఇండియా వీరశైవ మహాసభ అధ్యక్షుడు ఈశ్వర్ ఖండ్రేను సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ సమాజ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి అనిశెట్టి జయప్రకాష్ మాట్లాడుతూ వీరశైవ లింగాయత్ సమాజానికి చెందిన నాయకుడిగా ఈశ్వర్ ఖండ్రే మరోసారి క్యాబినెట్ హోదా పొందడం గర్వకారణమన్నారు. ప్రజాసేవ, సమాజ అభ్యున్నతి పట్ల ఆయన చూపుతున్న కృషికి గుర్తింపుగానే ఈ అవకాశం లభించిందని పేర్కొన్నారు. అలాగే ఈ గౌరవప్రదమైన అవకాశాన్ని కల్పించిన డి.కె. శివకుమార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈశ్వర్ ఖండ్రే తన పదవిలో మరింత సమర్థవంతంగా పనిచేస్తూ ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, వీరశైవ లింగాయత్ సమాజ పురోగతికి విశేష సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వీరశైవ లింగాయత్ సమాజ రాష్ట్ర నాయకులు సిహెచ్ బసవరాజ్, సులగంటి సిద్ధేశ్వర్, శివరాజ్ పాటిల్, సదాశివపేట అధ్యక్షుడు గందిగా రాజు, జిల్లా యువజన అధ్యక్షుడు బుగ్గన మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి