'గో టు విలేజ్' కార్యక్రమాన్ని విజయవంతం చేయండి:బోయ లింగస్వామి మాదిగ
'గో టు విలేజ్' కార్యక్రమాన్ని విజయవంతం చేయండి:బోయ లింగస్వామి మాదిగ
K.RAVI
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టబోయే "గ్రామాలకు తరలండి" (గో టు విలేజ్) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాదిగ పిలుపునిచ్చారు. చౌటుప్పల్ లోని అంబేద్కర్ భవనంలో మండల అధ్యక్షుడు బొడ్డు శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లింగస్వామి మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ నేతృత్వంలో 30 ఏళ్లుగా ఎన్నో హక్కుల పోరాటాలు గెలిచిన చరిత్ర ఎమ్మార్పీఎస్కు ఉందన్నారు. సుదీర్ఘ పోరాట ఫలితంగా వచ్చిన ఎస్సీ వర్గీకరణ ఫలాలు మాదిగ, ఉపకులాల ప్రజలందరికీ అందాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు బోయ రాము, ఎమ్మార్పీఎస్ మున్సిపల్ అధ్యక్షులు ఎర్ర శంకర్, ఎమ్మార్పీఎస్ తాళ్ళసింగారం గ్రామ శాఖ అధ్యక్షులు దోనకోండ కీరణ్ కూమార్,ఉదరి యాదయ్య, బోయ జోసఫ్, బోయ సృజన్ లు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి