రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో బుధవారం అనారోగ్యంతో మృతి చెందిన సల్ల భిక్షమయ్య మృతదేహానికి గ్రామ సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య, మాజీ సర్పంచ్ గుత్త నరసింహరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా భిక్షమయ్య మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన వారు, ఆయన కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు ఈ విషాదాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కడారి యాదయ్య, నరపాక అశోక్, కడారి మల్లేష్, కడారి అంజి, చల్ల శ్రీశైలం, నరపాక కిరణ్, నరపాక లక్ష్మణ్, కడారి మహేష్, కడారి రవి, కొండ సాయినాథ్, బొడ్డుపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి