Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 24, 2026 11:21 PM

ఘనంగా కవాడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఘనంగా కవాడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఘనంగా కవాడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
14-06-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

కవాడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల 2003-2004 విద్యా సంవత్సర పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం పాఠశాల ఆవరణలో ఘనంగా జరిగింది. దాదాపు 22 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న విద్యార్థులు ఆనందోత్సాహాల మధ్య తమ పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

ఈ సందర్భంగా చిన్ననాటి స్నేహాలు, గురువులతో అనుబంధం, పాఠశాల జీవితంలోని అనుభవాలను పరస్పరం పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఎన్నో ఏళ్ల తర్వాత సహచరులను కలుసుకోవడం సంతోషంగా ఉందని పలువురు పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన అప్పటి ఉపాధ్యాయులు కుల్డిప్ కుమార్, అశోక్ కుమార్, చంద్ర కాంత్ లను పూర్వ విద్యార్థులు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. విద్యార్థుల విజయాలను చూసి గర్వంగా ఉందని గురువులు అభిప్రాయపడ్డారు. విద్యార్థులు జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.ఆత్మీయత, అనురాగాలు, పాత జ్ఞాపకాల సందడితో సాగిన ఈ సమ్మేళనం అందరినీ అలరించింది. భవిష్యత్తులోనూ ఇలాంటి సమావేశాలను తరచుగా నిర్వహించుకోవాలని పూర్వ విద్యార్థులు నిర్ణయించారు.పాఠశాల అభివృద్ధికి తమ బ్యాచ్ నుండి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ప్రదీఫ్, రాము, బాలకృష్ణ, రవి, కుమార్, నవీన్, శ్రావణ్ కుమార్, ఆనంద్, మహేష్, భాస్కర్, రాజేందర్ రెడ్డి సారయ్య, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా కవాడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Article Image

కవాడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల 2003-2004 విద్యా సంవత్సర పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం పాఠశాల ఆవరణలో ఘనంగా జరిగింది. దాదాపు 22 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న విద్యార్థులు ఆనందోత్సాహాల మధ్య తమ పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

ఈ సందర్భంగా చిన్ననాటి స్నేహాలు, గురువులతో అనుబంధం, పాఠశాల జీవితంలోని అనుభవాలను పరస్పరం పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఎన్నో ఏళ్ల తర్వాత సహచరులను కలుసుకోవడం సంతోషంగా ఉందని పలువురు పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన అప్పటి ఉపాధ్యాయులు కుల్డిప్ కుమార్, అశోక్ కుమార్, చంద్ర కాంత్ లను పూర్వ విద్యార్థులు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. విద్యార్థుల విజయాలను చూసి గర్వంగా ఉందని గురువులు అభిప్రాయపడ్డారు. విద్యార్థులు జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.ఆత్మీయత, అనురాగాలు, పాత జ్ఞాపకాల సందడితో సాగిన ఈ సమ్మేళనం అందరినీ అలరించింది. భవిష్యత్తులోనూ ఇలాంటి సమావేశాలను తరచుగా నిర్వహించుకోవాలని పూర్వ విద్యార్థులు నిర్ణయించారు.పాఠశాల అభివృద్ధికి తమ బ్యాచ్ నుండి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ప్రదీఫ్, రాము, బాలకృష్ణ, రవి, కుమార్, నవీన్, శ్రావణ్ కుమార్, ఆనంద్, మహేష్, భాస్కర్, రాజేందర్ రెడ్డి సారయ్య, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News