ఘనంగా కవాడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ఘనంగా కవాడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
RAPOLU LINGASWAMY
కవాడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల 2003-2004 విద్యా సంవత్సర పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం పాఠశాల ఆవరణలో ఘనంగా జరిగింది. దాదాపు 22 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న విద్యార్థులు ఆనందోత్సాహాల మధ్య తమ పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్భంగా చిన్ననాటి స్నేహాలు, గురువులతో అనుబంధం, పాఠశాల జీవితంలోని అనుభవాలను పరస్పరం పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఎన్నో ఏళ్ల తర్వాత సహచరులను కలుసుకోవడం సంతోషంగా ఉందని పలువురు పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన అప్పటి ఉపాధ్యాయులు కుల్డిప్ కుమార్, అశోక్ కుమార్, చంద్ర కాంత్ లను పూర్వ విద్యార్థులు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. విద్యార్థుల విజయాలను చూసి గర్వంగా ఉందని గురువులు అభిప్రాయపడ్డారు. విద్యార్థులు జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.ఆత్మీయత, అనురాగాలు, పాత జ్ఞాపకాల సందడితో సాగిన ఈ సమ్మేళనం అందరినీ అలరించింది. భవిష్యత్తులోనూ ఇలాంటి సమావేశాలను తరచుగా నిర్వహించుకోవాలని పూర్వ విద్యార్థులు నిర్ణయించారు.పాఠశాల అభివృద్ధికి తమ బ్యాచ్ నుండి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ప్రదీఫ్, రాము, బాలకృష్ణ, రవి, కుమార్, నవీన్, శ్రావణ్ కుమార్, ఆనంద్, మహేష్, భాస్కర్, రాజేందర్ రెడ్డి సారయ్య, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి