Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా కవాడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 15, 2026 12:11 AM

ఘనంగా కవాడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఘనంగా కవాడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఘనంగా కవాడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
June 14, 2026 10:37 PM 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

కవాడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల 2003-2004 విద్యా సంవత్సర పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం పాఠశాల ఆవరణలో ఘనంగా జరిగింది. దాదాపు 22 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న విద్యార్థులు ఆనందోత్సాహాల మధ్య తమ పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

ఈ సందర్భంగా చిన్ననాటి స్నేహాలు, గురువులతో అనుబంధం, పాఠశాల జీవితంలోని అనుభవాలను పరస్పరం పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఎన్నో ఏళ్ల తర్వాత సహచరులను కలుసుకోవడం సంతోషంగా ఉందని పలువురు పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన అప్పటి ఉపాధ్యాయులు కుల్డిప్ కుమార్, అశోక్ కుమార్, చంద్ర కాంత్ లను పూర్వ విద్యార్థులు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. విద్యార్థుల విజయాలను చూసి గర్వంగా ఉందని గురువులు అభిప్రాయపడ్డారు. విద్యార్థులు జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.ఆత్మీయత, అనురాగాలు, పాత జ్ఞాపకాల సందడితో సాగిన ఈ సమ్మేళనం అందరినీ అలరించింది. భవిష్యత్తులోనూ ఇలాంటి సమావేశాలను తరచుగా నిర్వహించుకోవాలని పూర్వ విద్యార్థులు నిర్ణయించారు.పాఠశాల అభివృద్ధికి తమ బ్యాచ్ నుండి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ప్రదీఫ్, రాము, బాలకృష్ణ, రవి, కుమార్, నవీన్, శ్రావణ్ కుమార్, ఆనంద్, మహేష్, భాస్కర్, రాజేందర్ రెడ్డి సారయ్య, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News