ఉప సర్పంచ్ల ఫోరం రామన్నపేట మండల అధ్యక్షుడిగా మోటి రమేష్.
ఉప సర్పంచ్ల ఫోరం రామన్నపేట మండల అధ్యక్షుడిగా మోటి రమేష్.
Editor Desk
తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచ్ల ఫోరం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సూర్కంటి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో రామన్నపేట మండల ఉప సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడిగా మోటి రమేష్ను నియమించారు. ఈ మేరకు శనివారం నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ సూర్కంటి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఉప సర్పంచ్ల సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతానికి ఫోరం కృషి చేస్తుందని తెలిపారు. మండల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మోటి రమేష్ సమర్థవంతంగా పనిచేసి ఉప సర్పంచ్లకు అండగా నిలవాలని ఆకాంక్షించారు.
మోటి రమేష్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మండలంలోని ఉప సర్పంచ్ల సమస్యలను ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఫోరం బలోపేతానికి కృషి చేస్తూ గ్రామాభివృద్ధికి తోడ్పాటునందిస్తానని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి