మాజీ సర్పంచుల బిల్లుల సమస్య పరిష్కరించాలి: సర్పంచుల సంఘం జేఏసీ
మాజీ సర్పంచుల బిల్లుల సమస్య పరిష్కరించాలి: సర్పంచుల సంఘం జేఏసీ
Biksham
డిజిపిని కలిసి మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లుల సమస్యను పరిష్కరించాలని కోరుతున్నామని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 31 నెలలుగా మాజీ సర్పంచుల బిల్లులు చెల్లించడం లేదని ఆయన విమర్శించారు. బిల్లులు అందక మాజీ సర్పంచులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వారి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని అన్నారు.
మా బిల్లులు చెల్లించాలని కోరుతూ ఏ కార్యక్రమం చేపట్టినా ముందస్తు అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ను కలిసి వినతిపత్రం అందజేయాలని ప్రయత్నించినా అరెస్టు చేస్తున్నారని తెలిపారు. కాబట్టి ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కల్పించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్, సర్పంచుల సంఘం కార్యదర్శి కేశబోయిన మల్లయ్య యాదవ్, వై అరవింద్ రెడ్డి, సముద్రాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి