29 పశువులతో వెళ్తున్న వాహనం సీజ్.. పోలీసులకు అప్పగించిన భజరంగ్దళ్
ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్లోని బహదూర్పూర్కు పశువులను అక్రమంగా తరలిస్తున్న యత్నాన్ని భజరంగ్దళ్ కార్యకర్తలు భగ్నం చేశారు. చౌటుప్పల్ మండలం లక్కారం సమీపంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఒక వాహనాన్ని వారు అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని తనిఖీ చేయగా.. అందులో అత్యంత దయనీయ స్థితిలో ఉన్న 21 ఎద్దులు (నందిమహారాజులు), 8 గోవులు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పశువులను స్వాధీనం చేసుకుని, సురక్షిత ప్రాంతంలో ఉన్న గోశాలకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.గోవులను అక్రమంగా కసాయిఖానాలకు తరలిస్తున్న వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని భజరంగ్దళ్ జిల్లా కో–కన్వీనర్ గోగు రవి డిమాండ్ చేశారు. పశువుల రవాణాపై అధికారులు నిరంతరం దృష్టి సారించాలని, సరిహద్దుల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి