Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్కారం వద్ద గోవుల అక్రమ రవాణాకు బ్రేక్ బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్ఫూర్తితో నిలిచిన ప్రాణాలు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 12:59 PM

లక్కారం వద్ద గోవుల అక్రమ రవాణాకు బ్రేక్

లక్కారం వద్ద గోవుల అక్రమ రవాణాకు బ్రేక్

లక్కారం వద్ద గోవుల అక్రమ రవాణాకు బ్రేక్
06-08-2026 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

29 పశువులతో వెళ్తున్న వాహనం సీజ్.. పోలీసులకు అప్పగించిన భజరంగ్‌దళ్‌

ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌లోని బహదూర్‌పూర్‌కు పశువులను అక్రమంగా తరలిస్తున్న యత్నాన్ని భజరంగ్‌దళ్ కార్యకర్తలు భగ్నం చేశారు. చౌటుప్పల్ మండలం లక్కారం సమీపంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఒక వాహనాన్ని వారు అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు.

​పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని తనిఖీ చేయగా.. అందులో అత్యంత దయనీయ స్థితిలో ఉన్న 21 ఎద్దులు (నందిమహారాజులు), 8 గోవులు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పశువులను స్వాధీనం చేసుకుని, సురక్షిత ప్రాంతంలో ఉన్న గోశాలకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.గోవులను అక్రమంగా కసాయిఖానాలకు తరలిస్తున్న వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని భజరంగ్‌దళ్ జిల్లా కో–కన్వీనర్ గోగు రవి డిమాండ్ చేశారు. పశువుల రవాణాపై అధికారులు నిరంతరం దృష్టి సారించాలని, సరిహద్దుల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలని కోరారు.

Sthanikam

లక్కారం వద్ద గోవుల అక్రమ రవాణాకు బ్రేక్

Article Image

29 పశువులతో వెళ్తున్న వాహనం సీజ్.. పోలీసులకు అప్పగించిన భజరంగ్‌దళ్‌

ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌లోని బహదూర్‌పూర్‌కు పశువులను అక్రమంగా తరలిస్తున్న యత్నాన్ని భజరంగ్‌దళ్ కార్యకర్తలు భగ్నం చేశారు. చౌటుప్పల్ మండలం లక్కారం సమీపంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఒక వాహనాన్ని వారు అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు.

​పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని తనిఖీ చేయగా.. అందులో అత్యంత దయనీయ స్థితిలో ఉన్న 21 ఎద్దులు (నందిమహారాజులు), 8 గోవులు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పశువులను స్వాధీనం చేసుకుని, సురక్షిత ప్రాంతంలో ఉన్న గోశాలకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.గోవులను అక్రమంగా కసాయిఖానాలకు తరలిస్తున్న వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని భజరంగ్‌దళ్ జిల్లా కో–కన్వీనర్ గోగు రవి డిమాండ్ చేశారు. పశువుల రవాణాపై అధికారులు నిరంతరం దృష్టి సారించాలని, సరిహద్దుల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News