పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియ నుండి తండా ప్రాంతాలను మినహాయించాలి
పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియ నుండి తండా ప్రాంతాలను మినహాయించాలి
Biksham
పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియ నుండి తండా ప్రాంతాలను మినహాయించాలని కోరుతూ తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం నాయకులు శుక్రవారం అదనపు జిల్లా కలెక్టర్ హరి సింగ్ నాయక్ ను శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరావత్ మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ తండా ప్రాంతాల్లోని పాఠశాలలను రేషనలైజేషన్ పరిధి నుండి మినహాయించి, అక్కడి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తండా ప్రాంతాల ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని విద్యా సదుపాయాలను యథావిధిగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కొర్ర భగ్గులాల్ నాయక్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ధరావత్ వసరామ్ నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ధరావత్ మోతీలాల్ నాయక్, సూర్యాపేట డివిజన్ అధ్యక్షుడు బానోత్ లింగా నాయక్, ధరావత్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి