Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రొద్దంలో ఉషశ్రీపై మండల కూటమి నాయకుల ఫైర్ "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 13, 2026 06:48 PM

రొద్దంలో ఉషశ్రీపై మండల కూటమి నాయకుల ఫైర్

రొద్దంలో ఉషశ్రీపై మండల కూటమి నాయకుల ఫైర్

రొద్దంలో ఉషశ్రీపై మండల కూటమి నాయకుల ఫైర్
June 13, 2026 05:46 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండలంలో వైసీపీ నేత ఉషశ్రీ చేసిన వ్యాఖ్యలపై మండల కూటమి నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఆమె చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని విమర్శించారు.


రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేస్తోందని, వాటిని చూసి ఓర్వలేకే వైసీపీ నాయకులు నిరాధార విమర్శలకు దిగుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఇప్పటికే వైసీపీ పాలనను తిరస్కరించారని, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని చూసి మరింతగా కూటమికి మద్దతు ఇస్తున్నారని అన్నారు.


ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని, రాజకీయ లబ్ధి కోసం అసత్య ప్రచారాలు మానుకోవాలని ఉషశ్రీకి హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News