శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండలంలో వైసీపీ నేత ఉషశ్రీ చేసిన వ్యాఖ్యలపై మండల కూటమి నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఆమె చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేస్తోందని, వాటిని చూసి ఓర్వలేకే వైసీపీ నాయకులు నిరాధార విమర్శలకు దిగుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఇప్పటికే వైసీపీ పాలనను తిరస్కరించారని, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని చూసి మరింతగా కూటమికి మద్దతు ఇస్తున్నారని అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని, రాజకీయ లబ్ధి కోసం అసత్య ప్రచారాలు మానుకోవాలని ఉషశ్రీకి హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి