PRINT TIME: June 12, 2026 11:44 PM
రైతులకు నాణ్యమైన ఎరువులే అందాలి.. ఫర్టిలైజర్ దుకాణాల తనిఖీలో ఏడీఏ లక్ష్మి
రైతులకు నాణ్యమైన ఎరువులే అందాలి.. ఫర్టిలైజర్ దుకాణాల తనిఖీలో ఏడీఏ లక్ష్మి
June 12, 2026 10:22 PM
15 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా సంగారెడ్డి జిల్లా ఏడీఏ లక్ష్మి సదాశివపేటలోని పలు ఫర్టిలైజర్ షాపులు, గోడౌన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లు, ఎరువుల నిల్వలను పరిశీలించి రైతులకు సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపారు. రైతులు నకిలీ విత్తనాలు, అధిక ధరల ఎరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఫర్టిలైజర్ యాప్ ద్వారా ఇంటి నుంచే ఎరువుల నిల్వల వివరాలు తెలుసుకుని బుకింగ్ చేసుకోవచ్చని వివరించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీలర్లను హెచ్చరించారు. ఈ తనిఖీల్లో వ్యవసాయ అధికారి రమేష్, రైతు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి