Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:19 AM

వెంచర్‌లో రక్తపాతం.. ఒగ్గు కళాకారుడిని బండరాయితో మోది హత్య

వెంచర్‌లో రక్తపాతం.. ఒగ్గు కళాకారుడిని బండరాయితో మోది హత్య

వెంచర్‌లో రక్తపాతం.. ఒగ్గు కళాకారుడిని బండరాయితో మోది హత్య
09-06-2026 721 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ, : తిప్పర్తి మండలం కేశరాజుపల్లి గ్రామ శివారులోని ఓ వెంచర్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ఓ వ్యక్తిని బండరాయితో మోది అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మృతుడు ఒగ్గు కళాకారుడిగా గుర్తింపు పొందినట్లు సమాచారం.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. హత్య జరిగిన ప్రాంతంలో ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలపై పలు కోణాల్లో విచారణ సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒగ్గు కళాకారుడి హత్యతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి పూర్తి వివరాలు, హత్య వెనుక ఉన్న కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Sthanikam

వెంచర్‌లో రక్తపాతం.. ఒగ్గు కళాకారుడిని బండరాయితో మోది హత్య

Article Image

నల్గొండ, : తిప్పర్తి మండలం కేశరాజుపల్లి గ్రామ శివారులోని ఓ వెంచర్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ఓ వ్యక్తిని బండరాయితో మోది అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మృతుడు ఒగ్గు కళాకారుడిగా గుర్తింపు పొందినట్లు సమాచారం.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. హత్య జరిగిన ప్రాంతంలో ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలపై పలు కోణాల్లో విచారణ సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒగ్గు కళాకారుడి హత్యతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి పూర్తి వివరాలు, హత్య వెనుక ఉన్న కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News