PRINT TIME: June 10, 2026 01:06 PM
వెంచర్లో రక్తపాతం.. ఒగ్గు కళాకారుడిని బండరాయితో మోది హత్య
వెంచర్లో రక్తపాతం.. ఒగ్గు కళాకారుడిని బండరాయితో మోది హత్య
June 09, 2026 10:37 AM
490 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
నల్గొండ, : తిప్పర్తి మండలం కేశరాజుపల్లి గ్రామ శివారులోని ఓ వెంచర్లో దారుణ హత్య చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ఓ వ్యక్తిని బండరాయితో మోది అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మృతుడు ఒగ్గు కళాకారుడిగా గుర్తింపు పొందినట్లు సమాచారం.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. హత్య జరిగిన ప్రాంతంలో ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలపై పలు కోణాల్లో విచారణ సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒగ్గు కళాకారుడి హత్యతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి పూర్తి వివరాలు, హత్య వెనుక ఉన్న కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి