Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:49 AM

మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా సీఐ సత్యనారాయణ రెడ్డి

మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా సీఐ సత్యనారాయణ రెడ్డి

మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా సీఐ సత్యనారాయణ రెడ్డి
10-06-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జనగామ,

రోడ్డుపై అనాధగా తిరుగుతూ ఆందోళనతో కనిపించిన ఓ వృద్ధుడికి జనగామ సీఐ సత్యనారాయణ రెడ్డి అండగా నిలిచారు. అతడిని ఓదార్చి, భోజనం ఏర్పాటు చేసి, అనంతరం వృద్ధాశ్రమంలో చేర్పించి మానవత్వాన్ని చాటుకున్నారు.

జనగామ రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో రెండు రోజులుగా ఓ 65 ఏళ్ల వృద్ధుడు అనాధగా తిరుగుతున్నాడని స్థానిక జర్నలిస్టు సోమవారం సీఐ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఐ అతడిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించి వివరాలు సేకరించారు. చిత్తూరు జిల్లాకు చెందిన దుర్గాస్వామి అలియాస్‌ దుర్గానాయుడుగా గుర్తించారు.

అన్నదమ్ములు లేకపోవడంతో ఆరేడు సంవత్సరాల క్రితం స్వగ్రామం విడిచి వచ్చానని, కొంతకాలం ఆలయాల్లో సేవలు చేశానని, అనంతరం మానసిక సమస్యల కారణంగా అక్కడ ఉండలేక దిక్కులేని పరిస్థితి ఏర్పడిందని వృద్ధుడు తెలిపాడు.

వృద్ధుడి పరిస్థితిని గమనించిన సీఐ ముందుగా అతనికి ఆహారం అందించారు. అనంతరం హెడ్‌ కానిస్టేబుల్‌ కిషన్‌ ద్వారా ప్రత్యేకంగా భోజనం తెప్పించి తినిపించారు. తర్వాత పోలీస్‌ వాహనంలో జనగామలోని రాజేశ్వరి వృద్ధాశ్రమానికి తరలించి చేర్పించారు.

పోలీసుల ఆప్యాయతతో వృద్ధుడిలో ధైర్యం పెరిగిందని స్థానికులు తెలిపారు. రోడ్లపై అనాధలుగా, నిరాశ్రయులుగా ఎవరైనా కనిపిస్తే సమీప పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించాలని, వారికి అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు

Sthanikam

మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా సీఐ సత్యనారాయణ రెడ్డి

Article Image

జనగామ,

రోడ్డుపై అనాధగా తిరుగుతూ ఆందోళనతో కనిపించిన ఓ వృద్ధుడికి జనగామ సీఐ సత్యనారాయణ రెడ్డి అండగా నిలిచారు. అతడిని ఓదార్చి, భోజనం ఏర్పాటు చేసి, అనంతరం వృద్ధాశ్రమంలో చేర్పించి మానవత్వాన్ని చాటుకున్నారు.

జనగామ రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో రెండు రోజులుగా ఓ 65 ఏళ్ల వృద్ధుడు అనాధగా తిరుగుతున్నాడని స్థానిక జర్నలిస్టు సోమవారం సీఐ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఐ అతడిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించి వివరాలు సేకరించారు. చిత్తూరు జిల్లాకు చెందిన దుర్గాస్వామి అలియాస్‌ దుర్గానాయుడుగా గుర్తించారు.

అన్నదమ్ములు లేకపోవడంతో ఆరేడు సంవత్సరాల క్రితం స్వగ్రామం విడిచి వచ్చానని, కొంతకాలం ఆలయాల్లో సేవలు చేశానని, అనంతరం మానసిక సమస్యల కారణంగా అక్కడ ఉండలేక దిక్కులేని పరిస్థితి ఏర్పడిందని వృద్ధుడు తెలిపాడు.

వృద్ధుడి పరిస్థితిని గమనించిన సీఐ ముందుగా అతనికి ఆహారం అందించారు. అనంతరం హెడ్‌ కానిస్టేబుల్‌ కిషన్‌ ద్వారా ప్రత్యేకంగా భోజనం తెప్పించి తినిపించారు. తర్వాత పోలీస్‌ వాహనంలో జనగామలోని రాజేశ్వరి వృద్ధాశ్రమానికి తరలించి చేర్పించారు.

పోలీసుల ఆప్యాయతతో వృద్ధుడిలో ధైర్యం పెరిగిందని స్థానికులు తెలిపారు. రోడ్లపై అనాధలుగా, నిరాశ్రయులుగా ఎవరైనా కనిపిస్తే సమీప పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించాలని, వారికి అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News