రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా, ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు వెలిమినేడు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 10:00 గంటలకు స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ‘రోడ్డు భద్రత అవగాహన గ్రామసభ’ నిర్వహించనున్నట్లు సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ సి.వి. ఆనంద్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. వీరితో పాటు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు మరియు వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొని, సురక్షిత ప్రయాణం – డ్రైవింగ్ లైసెన్స్ ఆవశ్యకతపై దిశానిర్దేశం చేయనున్నారు.
అందరూ తప్పక పాల్గొనాలి: సర్పంచ్
గ్రామ ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, అనధికారులు ఈ సదస్సుకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని సర్పంచ్ కోరారు. ముఖ్యంగా ఆటోలు, ట్రాక్టర్లు, డీసీఎంలు, లారీలు మరియు ఇతర వాహనాల యజమానులు, డ్రైవర్లు, యూనియన్ సభ్యులు ఈ అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకోవాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం, పంచాయతీ కార్యదర్శి విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమ వివరాలు:
తేదీ: 10-06-2026 (బుధవారం)
సమయం: ఉదయం 10:00 గంటలకు
స్థలం: గ్రామ పంచాయతీ కార్యాలయం, వెలిమినేడు.
ప్రకటన:
మల్లం మహేష్
మాజీ వార్డు సభ్యులు, వెలిమినేడు.
కలిసి వద్దాం.. కదిలి వద్దాం!
గ్రామ ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, మరియు ముఖ్యంగా వాహనదారులు (ఆటోలు, ట్రాక్టర్లు, డీసీఎంలు, లారీలు, ఇతర వాహనాల యజమానులు) అందరూ ఈ సభకు హాజరై, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని కోరుచున్నాము.
మన భద్రత - మన బాధ్యత!

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి