రైతులకు అండగా సర్పంచ్ బండ సరోజ-అంజిరెడ్డి. లచ్చిరెడ్డిగూడెం కొనుగోలు కేంద్రంలో 28,609 బస్తాల ధాన్యం సేకరణ
రైతులకు అండగా సర్పంచ్ బండ సరోజ-అంజిరెడ్డి. లచ్చిరెడ్డిగూడెం కొనుగోలు కేంద్రంలో 28,609 బస్తాల ధాన్యం సేకరణ
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం లచ్చిరెడ్డిగూడెం (జనంపల్లి)లో ఎన్డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని విజయవంతంగా ముగించారు. కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తికావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బండ సరోజ-అంజిరెడ్డి మాట్లాడుతూ కేంద్రం ద్వారా 135 మంది రైతుల నుంచి 11,443 క్వింటాళ్ల (28,609 బస్తాలు) ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. మొత్తం 32 లారీల ద్వారా ధాన్యాన్ని తరలించగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్ణీత గడువులో కొనుగోళ్లు పూర్తిచేయడం అభినందనీయమన్నారు.
రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించిన ఎన్డీసీఎంఎస్ సిబ్బంది, సంబంధిత అధికారులను ఈ సందర్భంగా అభినందించారు.
కార్యక్రమంలో ఎన్డీసీఎంఎస్ నిర్వాహకులు గంగుల వెంకట్రెడ్డి, నక్క యాదయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ పబ్బు వెంకటేష్, బుక్కీపర్ పండుగ నగేష్, ట్యాబ్ ఆపరేటర్ పండుగ కావ్యతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి