Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:53 AM

రైతులకు అండగా సర్పంచ్ బండ సరోజ-అంజిరెడ్డి. లచ్చిరెడ్డిగూడెం కొనుగోలు కేంద్రంలో 28,609 బస్తాల ధాన్యం సేకరణ

రైతులకు అండగా సర్పంచ్ బండ సరోజ-అంజిరెడ్డి. లచ్చిరెడ్డిగూడెం కొనుగోలు కేంద్రంలో 28,609 బస్తాల ధాన్యం సేకరణ

రైతులకు అండగా సర్పంచ్ బండ సరోజ-అంజిరెడ్డి. లచ్చిరెడ్డిగూడెం కొనుగోలు కేంద్రంలో 28,609 బస్తాల ధాన్యం సేకరణ
10-06-2026 94 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం లచ్చిరెడ్డిగూడెం (జనంపల్లి)లో ఎన్‌డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని విజయవంతంగా ముగించారు. కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తికావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.


ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బండ సరోజ-అంజిరెడ్డి మాట్లాడుతూ కేంద్రం ద్వారా 135 మంది రైతుల నుంచి 11,443 క్వింటాళ్ల (28,609 బస్తాలు) ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. మొత్తం 32 లారీల ద్వారా ధాన్యాన్ని తరలించగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్ణీత గడువులో కొనుగోళ్లు పూర్తిచేయడం అభినందనీయమన్నారు.


రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించిన ఎన్‌డీసీఎంఎస్ సిబ్బంది, సంబంధిత అధికారులను ఈ సందర్భంగా అభినందించారు.


కార్యక్రమంలో ఎన్‌డీసీఎంఎస్ నిర్వాహకులు గంగుల వెంకట్‌రెడ్డి, నక్క యాదయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ పబ్బు వెంకటేష్, బుక్‌కీపర్ పండుగ నగేష్, ట్యాబ్ ఆపరేటర్ పండుగ కావ్యతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.



Sthanikam

రైతులకు అండగా సర్పంచ్ బండ సరోజ-అంజిరెడ్డి. లచ్చిరెడ్డిగూడెం కొనుగోలు కేంద్రంలో 28,609 బస్తాల ధాన్యం సేకరణ

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం లచ్చిరెడ్డిగూడెం (జనంపల్లి)లో ఎన్‌డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని విజయవంతంగా ముగించారు. కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తికావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.


ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బండ సరోజ-అంజిరెడ్డి మాట్లాడుతూ కేంద్రం ద్వారా 135 మంది రైతుల నుంచి 11,443 క్వింటాళ్ల (28,609 బస్తాలు) ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. మొత్తం 32 లారీల ద్వారా ధాన్యాన్ని తరలించగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్ణీత గడువులో కొనుగోళ్లు పూర్తిచేయడం అభినందనీయమన్నారు.


రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించిన ఎన్‌డీసీఎంఎస్ సిబ్బంది, సంబంధిత అధికారులను ఈ సందర్భంగా అభినందించారు.


కార్యక్రమంలో ఎన్‌డీసీఎంఎస్ నిర్వాహకులు గంగుల వెంకట్‌రెడ్డి, నక్క యాదయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ పబ్బు వెంకటేష్, బుక్‌కీపర్ పండుగ నగేష్, ట్యాబ్ ఆపరేటర్ పండుగ కావ్యతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News