స్నేహబంధం.. ఆపన్న హస్తం!
స్నేహబంధం.. ఆపన్న హస్తం!
K.RAVI
* మల్లేష్ కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం
* చౌటుప్పల్ జెడ్పీహెచ్ఎస్ 1998-99 బ్యాచ్ పూర్వ విద్యార్థుల మానవత్వం
కష్టకాలంలో ఉన్న స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచి, తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు చౌటుప్పల్ జెడ్పీహెచ్ఎస్ 1998–99 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థులు. ఇటీవల అకాల మరణం చెందిన తమ తోటి స్నేహితుడు అన్నముని మల్లేష్ కుటుంబానికి రూ.1,00,000/- (అక్షరాలా ఒక లక్ష రూపాయలు) ఆర్థిక సహాయాన్ని ఆదివారం సాయంత్రం అందజేశారు.
మల్లేష్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన స్నేహితులు, ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్టసమయంలో తోటి స్నేహితుడి కుటుంబానికి కొండంత అండగా నిలవడం తమ బాధ్యతగా భావించి ఈ ఆర్థిక సాయాన్ని అందించినట్లు వారు పేర్కొన్నారు.
వెల్ఫేర్ ఫండ్ ద్వారా నిరంతర సేవలు
"స్నేహబంధం కేవలం గడిపిన జ్ఞాపకాలకే పరిమితం కాకూడదు. ఆపదలో ఉన్నప్పుడు ఒకరికి ఒకరు అండగా నిలబడటంలోనే స్నేహం యొక్క అసలైన గొప్పతనం దాగి ఉంది."ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2020 కరోనా విపత్కర పరిస్థితుల్లో తామంతా కలిసి ఒక 'వెల్ఫేర్ ఫండ్' (సంక్షేమ నిధి) ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఫండ్ ద్వారా ఇప్పటివరకు గ్రూప్లోని పలువురు స్నేహితులకు వైద్య ఖర్చులు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక సహాయం అందించి ఆదుకున్నామని వివరించారు. భవిష్యత్తులోనూ తమ బ్యాచ్ స్నేహితులకు ఎలాంటి కష్టం వచ్చినా అన్ని విధాలుగా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో
1998-99 బ్యాచ్ మిత్రులు ఉడుగు హరికృష్ణ, చిక్క శ్రీనివాస్, సందగళ్ల సతీష్, బాలకృష్ణ గౌడ్, ఎస్బి వెంకటేష్, జోర్కా నాగేష్, ముప్పిడి పాండు, సమ్మి, ఆలం పాషా, కత్తుల రవి, రాంప్రసాద్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి