హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు గడువు ముగిసిన చిల్లి సాస్ స్వాధీనం
హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు గడువు ముగిసిన చిల్లి సాస్ స్వాధీనం
Editor Desk
యాదగిరిగుట్ట పట్టణంలోని పలు హోటళ్లలో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శివశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మంత్రాలయం, త్రినేత రాఘవేంద్ర, సన్నిధి హోటళ్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించారు.
తనిఖీల సందర్భంగా సన్నిధి హోటల్ స్టోర్రూమ్లో గడువు ముగిసిన కొన్ని చిల్లి సాస్ బాటిళ్లు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. అలాగే ఆహార పదార్థాల్లో వినియోగిస్తున్న కొన్ని అనుమానాస్పద పదార్థాలు, పలు కంపెనీల తాగునీటి సీసాలు, వంట సామగ్రికి సంబంధించిన నమూనాలను సేకరించారు.
సేకరించిన నమూనాలను పరీక్షల నిమిత్తం హైదరాబాద్లోని ప్రయోగశాలకు పంపించినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. పరీక్షల్లో నిబంధనలకు విరుద్ధంగా రసాయనాలు లేదా మోతాదుకు మించి హానికర పదార్థాలు ఉన్నట్లు తేలితే సంబంధిత హోటళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించడమే లక్ష్యంగా జిల్లావ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి